ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కాసేపట్లో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు బయల్దేరిన పవన్ కు.. అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. మొదటగా తుర్కపల్లి దగ్గర పవన్ కల్యాణ్ కు జనసేన, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కు గజమాలతో ఘనంగా సన్మానించారు అభిమానులు. ఈ సందర్భంగా.. ఓపెన టాప్ కారు నుంచి పవన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బీజేపీ కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పని చేస్తుందని అన్నారు.
Read Also: Actor Suman: చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టించబోతున్నారు..
మరోవైపు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టులోని బృందావనం గార్డెన్ దగ్గర ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. ఈ క్రమంలో.. జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా చేరుకుని స్వాగతం పలికారు. అటు.. కొండగట్టులో కూడా జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మరికాసేపట్లో పవన్ కల్యాణ్ అంజన్నను దర్శించుకోనున్నారు. అనంతరం.. మళ్లీ హైదరాబాద్ కు తిరుగ పయనం కానున్నారు. పవన్ కల్యాణ్ రాక దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Tamilnadu : తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి