Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cs Neerabh Kumar Prasad Review Of Implementation Of Centrally Sponsored Schemes

Andhra Pradesh: కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ సమీక్ష

NTV Telugu Twitter
Published Date :September 26, 2024 , 3:33 pm
By Mahesh Jakki
  • కేంద్ర ప్రాయోజిత పథకాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
  • వివిధ శాఖల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుపై చర్చ
  • అమలు తీరును వివరించిన అధికారులు
Andhra Pradesh: కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ సమీక్ష
  • Follow Us :
  • google news
  • dailyhunt
Andhra Pradesh: రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు, గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ముందుగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రాయోజిక పథకాలపై సీఎస్ సమీక్షించగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడం జరుగుతోందని వివరించారు. 2023-24లో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 13వేల 366 కోట్ల రూపాయలను, 2024-2025లో ఇప్పటి వరకూ 7వేల 899 కోట్ల రూపాయలను  ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. 2024-2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాయోజిత పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ వాటాగా 8వేల 340 కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. పంచాయితీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నట్టు శశిభూషణ్ కుమార్ సీఎస్‌కు వివరించారు.

Read Also: P. Chidambaram: రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ వెనకాడదు..

అనంతరం నైపుణ్య శిక్షణ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షిస్తూ.. 2023-24, 2024-25లో ఇప్పటి వరకూ నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుకు కేంద్ర ప్రభుత్వం వాటా,అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాల్లో కవర్ చేయని కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని కూడా రాష్ట్రంలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నైపుణ్య శిక్షణ విభాగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఔట్ కమ్ బేస్డ్ మెరుగైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు.ఇప్పటి వరకూ నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి సవివరమైన నివేదికను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు.
Read Also:

Perni Nani: బెదిరింపులకు బెదిరేది లేదు.. జనసైనికుల ఆందోళనపై స్పందించిన పేర్ని నాని

తదుపరి హోం శాఖకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పధకాలను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్ హోం శాఖకు సంబంధించి పోలీస్ బలగాల ఆధునీకరణ వంటి 3 కేంద్ర ప్రాయోజిత పధకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైమ్ గవర్నెస్ వ్యవస్థతో అనుసంధానించాలని సీఎస్ చెప్పారు. అనంతరం సాంఘిక, బీసీ, గిరిజన మహిళా, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు, గృహ నిర్మాణం, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలు ప్రగతిని ఆయా శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, పోలీస్ శాఖ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ, ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP CS Neerabh Kumar Prasad
  • AP Government
  • Centrally Sponsored Schemes
  • latest news

తాజావార్తలు

  • Teacher: మహారాష్ట్రలో కారు ప్రమాదం.. నల్గొండ టీచర్ సజీవ దహనం

  • Gold Rates: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

  • Bihar Assembly elections: రెండు-మూడు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..!

  • Bihar: బీహార్‌లో దారుణం.. 9 ఏళ్ల దళిత బాలిక హత్యాచారం.. వైద్యుల నిర్లక్ష్యంపై రాహుల్‌గాంధీ ఫైర్

  • Telusu Kada : అందరికీ తెలిసేలా చేప్పేది ఆరోజే!

ట్రెండింగ్‌

  • Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

  • Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

  • Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!

  • Viral Video: అంత ఆగలేకపోతున్నారా ఏంటి.. పబ్లిక్‌గా రొమాన్స్‌లో మునిగితేలిన యువత..!

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions