Congress: కాంగ్రెస్పై వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. గెలుపు సంగతి తర్వాత.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను కూడా రాబట్టలేకపోయింది.. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానంపై ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ అధిష్టానం కార్యకర్తలను అన్యాయం చేసిందన్న ఆమె.. నచ్చిన వారికి ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇచ్చారు.. ఎందుకు? వాళ్లు ఢిల్లీ వెళ్ళి షర్మిల భజన చేస్తారనా? అని నిలదీశారు.. కాంగ్రెస్ కోసం పని చేసిన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వలేదు.. మాణిక్కం ఠాకూర్, షర్మిల, సీడబ్ల్యూసీ మెంబర్లు.. ఇలా కాంగ్రెస్ పెద్దలకు మొరపెట్టుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: NEET Results 2024 : ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. పరీక్ష రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఇక, 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకుని పదవులు అనుభవించిన నాయకులు వెళ్లిపోయారని విమర్శించారు పద్మశ్రీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పనిచేశాం.. సొంత డబ్బులు, అప్పులు చేసి మరీ పార్టీ కోసం పనిచేశామన్నారు.. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనుకున్నా.. నేను కేడర్ కి న్యాయం చేయలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు సుంకర పద్మశ్రీ.. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.. పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కార్యకర్తలకు కనీసం అండగా నిలబడలేదు. కనీసం, ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు. కాగా, టిక్కెట్ల కేటాయింపు సమయంలోనూ సుంకర పద్మశ్రీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.. విజయవాడ తూర్పు టిక్కెట్ ను ఆమెకు ప్రకటించారు.. కానీ, తాను ఎంపీ టిక్కెట్ ను అడిగానని తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేయడం.. ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!