NEET Results 2024 : ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. పరీక్ష రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం నీట్ 2024 ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 13 లక్షల మందికి పైగా అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణులవ్వగా, వారిలో 67 మంది అభ్యర్థులు నంబర్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎలా అగ్రస్థానంలో నిలిచారనే దానిపై వివాదం నెలకొంది. అనేక ఇతర ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. 720 మార్కుల పేపర్కు కొంతమంది పిల్లలు 718, 719 మార్కులు కూడా
సాధించారు. నిపుణులు దీనిపై ప్రశ్నలను లేవనెత్తారు. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? దీనిపై ఇన్ని ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నారో చూద్దాం.
READ MORE: Gopal Rai: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. ఆప్ మంత్రి స్పష్టం
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
నీట్-యూజీ పరీక్షలో 67 మంది విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. 720 మార్కులకు గానూ పరీక్ష నిర్వహించారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఇవ్వబడ్డాయి. సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇస్తే, 720 మార్కులు వస్తాయి. ఎవరైనా ఒక ప్రశ్నను వదిలివేస్తే, అతనికి 716 మార్కులు వస్తాయి. ఎవరైనా ఒక ప్రశ్నకు తప్పుగా సమాధానం ఇస్తే అతనికి 715 మార్కులు వస్తాయి. మరి పిల్లలకు 718, 719 మార్కులు ఎలా వచ్చయనే ప్రశ్న ఉత్పన్నమైంది.
READ MORE: Mallu Bhatti Vikramarka: నేడు వివిధ శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ…
వివాదం ముదిరిపోవడంతో ఎన్టీఎల్ ఈ సమాధానం..
ఈ పిల్లలు సాధించిన మార్కులపై ఎన్టిఎల్ మాట్లాడుతూ.. “ఈ పరీక్ష నిర్వహించినప్పుడు, కొంతమంది పిల్లలకు పేపర్ ఆలస్యంగా వచ్చాయి. దీని వల్ల గ్రేస్ మార్కులు ఇచ్చాం. గ్రేస్ మార్కుల వల్ల మాత్రమే ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా చోట్ల పరీక్షలో సమయం వృధా కావడం, కొన్ని చోట్ల పేపర్లు 20 నిమిషాల వరకు ఆలస్యంగా రావడంతో పిల్లలు ఎన్టీఎస్లో ఫిర్యాదు చేశారు. వారికి ఇక్కడ గ్రేస్ మార్కులు వచ్చాయి. అందుకే 718 లేదా 719 మార్కులు వేయాల్సి వచ్చింది. నీట్ పరీక్షలో కెమిస్ట్రీపై ఒక ప్రశ్న వచ్చింది. దీనికి సంబంధించి వివాదం ఉంది. ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆప్సన్లలో రెండు సమాధానాలు సరైనవే. నిజానికి, NCRT యొక్క పాత పుస్తకంలో, ఒక సమాధానం సరైనదిగా చూపబడింది. కొత్త పుస్తకంలో మరొక సమాధానం సరైనదిగా చూపబడింది. దీంతో రెండు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు వచ్చాయి. దీంతో అధిక సంఖ్యలో విద్యార్థులు పూర్తి మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ” అని ఎన్టీఏ పేర్కొంది.
కోర్టుకు చేరిన వ్యవహారం..
2024 NEET-UG పరీక్షను తిరిగి నిర్వహించాలని కోరుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మే 5న నిర్వహించే పరీక్షను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకేజీపై పలు కేసులు పిటిషనర్ల దృష్టికి రావడంతో అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ని ఉల్లంఘించడమేనని, ఇది న్యాయమైన పద్ధతిలో పరీక్షకు హాజరైన కొంతమంది అభ్యర్థులకు అన్యాయమైన ప్రయోజనం చేకూర్చిందని పిటిషన్ పేర్కొంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?