Congress: కాంగ్రెస్పై వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. గెలుపు సంగతి తర్వాత.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను కూడా రాబట్టలేకపోయింది.. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానంపై ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ అధిష్టానం కార్యకర్తలను అన్యాయం చేసిందన్న ఆమె.. నచ్చిన వారికి ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇచ్చారు.. ఎందుకు? వాళ్లు ఢిల్లీ వెళ్ళి షర్మిల భజన చేస్తారనా? అని నిలదీశారు.. కాంగ్రెస్ కోసం పని చేసిన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వలేదు.. మాణిక్కం ఠాకూర్, షర్మిల, సీడబ్ల్యూసీ మెంబర్లు.. ఇలా కాంగ్రెస్ పెద్దలకు మొరపెట్టుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: NEET Results 2024 : ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. పరీక్ష రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
ఇక, 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకుని పదవులు అనుభవించిన నాయకులు వెళ్లిపోయారని విమర్శించారు పద్మశ్రీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పనిచేశాం.. సొంత డబ్బులు, అప్పులు చేసి మరీ పార్టీ కోసం పనిచేశామన్నారు.. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనుకున్నా.. నేను కేడర్ కి న్యాయం చేయలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు సుంకర పద్మశ్రీ.. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.. పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కార్యకర్తలకు కనీసం అండగా నిలబడలేదు. కనీసం, ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు. కాగా, టిక్కెట్ల కేటాయింపు సమయంలోనూ సుంకర పద్మశ్రీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.. విజయవాడ తూర్పు టిక్కెట్ ను ఆమెకు ప్రకటించారు.. కానీ, తాను ఎంపీ టిక్కెట్ ను అడిగానని తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేయడం.. ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!