Jagananna Vidya Deevena: నేడు జగనన్న జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM YS Jagan: నేడు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8 లక్షల 9 వేల 39 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయనున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద సీఎం జగన్ సర్కార్ ఇప్పటి వరకు 18,576 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికంగా ఉంది. అయితే, పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలనే లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివేవారు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్ లో నేరుగా ఏపీ సర్కార్ జమ చేస్తుంది.
Read Also: Mahalakshmi Stotram: చేస్తే కోరికలన్నీ తీరాలంటే.. ఈ స్తోత్ర పారాయణం చేయండి
అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ స్టూడెంట్స్ కు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని జగన్ ప్రభుత్వం అందిస్తోంది. అదే విధంగా ఫైనల్ ఎక్సామ్స్ రాసిన.. తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో మే 2023–ఆగస్ట్ 2023లలో 2 లక్షల 648 మంది విద్యార్థులకు మేలు చేసేలా 185.85 కోట్ల రూపాయలను సీఎం వైఎస్ జగన్ రిలీజ్ చేశారు.
Read Also: Pakistan : పాకిస్థాన్ ఆర్థిక నమూనా విఫలం.. మెరుగుపరచకపోతే అంతే అంటున్న వరల్డ్ బ్యాంక్
ఇక, ఫైనల్ పరీక్షలు ఇటీవలే ముగిసిన, పరీక్షలకు సన్నద్ధం అవుతున్న 59 వేల 724 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు మాత్రమే ప్రస్తుతం జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యారంగంపై అక్షరాలా 73 వేల 417 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఏపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!