CM Jagan: సామర్లకోటలో ఈనెల 12న సీఎం జగన్ పర్యటన ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకం ప్రారంభం కాకినాడ జిల్లా లో జరుగనుంది. అయితే, తాజాగా సామర్లకోటలో ఈటీసీ లే అవుట్లో పేదలకు నిర్మించిన గృహాలను సామూహికంగా ప్రారంభించేందుకు, పైలాన్ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబరు 12వ తారీఖున వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారికంగా సీఎం పర్యటన ఖరారు అయింది. ఇప్పటి వరకూ మూడు దఫాలు సామర్లకోటకు సీఎం పర్యటన ఉందంటూ ప్రచారం జరిగింది. గత 50 రోజులుగా సీఎం పర్యటనకు సామర్లకోటలోనే జిల్లా అధికార యంత్రాంగం ఉండి షేర్వాల్ టెక్నాలజీతో గృహాలను నిర్మించే పనులు చేస్తున్నారు. ఈ సందర్భంగా సామూహిక గృహ ప్రవేశాలతో పాటు సామర్లకోట ప్రభుత్వ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Dhanraj: డైరెక్టర్ అవుతున్న మరో జబర్దస్త్ కమెడియన్?
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
సీఎం జగన్ పర్యటన తేదీ ఖరారు కావడంతో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తు్న్నారు. సామర్లకోటలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సామర్లకోట అర్బన్ లబ్దిదారులకు కేటాయించిన ఈటీసీ లేవుట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు లేఅవుట్ లో పూర్తైన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్లు, రహదారులు, డ్రైయిన్లు, కరెంట్, తాగునీరు తదితర అంశాలపై గృహా నిర్మాణ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ ఇతర శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం సమీపంలోని కళాశాలలో హెలిప్యా్డ్ తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద బడుగు బలహీన వర్గాల వారికి 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాలు అందించనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?