CM Chandrababu: పోలవరం అనేక సంక్షోభాలను ఎదుర్కొంది.. ప్రాజెక్టును గందరగోళంగా చేశారు..
- పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది
- 7 మండలాలను విలీనం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయి
- నానా అవస్థలుపడి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టాం
- నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని సీఎం చంద్రబాబు ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. అధికారులతో పోలవరం ప్రాజెక్టు, స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు.
తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు. 2005లో రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టు ప్రారంభించడం, అప్పట్లోనే అవకతవకలు జరగడం, కాంట్రాక్టర్ రద్దుతో ప్రాజెక్టు అటకెక్కిందని చంద్రబాబు అన్నారు. నానా అవస్థలు పడి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు, రాయలసీమ వరకు తాగునీరు అందుతుందన్నారు. చైనాలో ఉన్న త్రీ గార్జస్ ప్రాజెక్టు తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం అంటూ చంద్రబాబు తెలిపారు. 2014 నుంచి 2019 వరకు 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు. 31వ సారి ప్రాజెక్టును చూడడానికి వచ్చానని.. తన కష్టాన్ని బూడిదపాలు చేశారని మండిపడ్డారు. రాజకీయాలకు ఉండకూడని వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా మారారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని.. ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చారని సీఎం చంద్రబాబు అన్నారు. డయాఫ్రమ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేదన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
ఈ ప్రాజెక్టుపై వంద సార్లు సమీక్షలు నిర్వహించామని.. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదన్నారు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుందని.. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేదన్నారు. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అన్నీ సవ్యంగా జరిగితేనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..