CM Chandrababu: పోలవరం అనేక సంక్షోభాలను ఎదుర్కొంది.. ప్రాజెక్టును గందరగోళంగా చేశారు..
- పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది
- 7 మండలాలను విలీనం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయి
- నానా అవస్థలుపడి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టాం
- నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని సీఎం చంద్రబాబు ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. అధికారులతో పోలవరం ప్రాజెక్టు, స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు.
తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు. 2005లో రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టు ప్రారంభించడం, అప్పట్లోనే అవకతవకలు జరగడం, కాంట్రాక్టర్ రద్దుతో ప్రాజెక్టు అటకెక్కిందని చంద్రబాబు అన్నారు. నానా అవస్థలు పడి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు, రాయలసీమ వరకు తాగునీరు అందుతుందన్నారు. చైనాలో ఉన్న త్రీ గార్జస్ ప్రాజెక్టు తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం అంటూ చంద్రబాబు తెలిపారు. 2014 నుంచి 2019 వరకు 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు. 31వ సారి ప్రాజెక్టును చూడడానికి వచ్చానని.. తన కష్టాన్ని బూడిదపాలు చేశారని మండిపడ్డారు. రాజకీయాలకు ఉండకూడని వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా మారారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని.. ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చారని సీఎం చంద్రబాబు అన్నారు. డయాఫ్రమ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేదన్నారు.
Also Read
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
ఈ ప్రాజెక్టుపై వంద సార్లు సమీక్షలు నిర్వహించామని.. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదన్నారు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుందని.. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేదన్నారు. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అన్నీ సవ్యంగా జరిగితేనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!