CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు.. నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. అనంతరం మళ్లీ అమరావతి రాబోతున్నారు.. ఇక, రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి. సాయంత్రం 4.41 గంటలకు చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు.. ముఖ్యమంత్రిగా సచివాయంలోని మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు చంద్రబాబు. బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు..
Read Also: Mohan Charan Majhi: ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం..
కాసేపట్లో కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు.. ఈ రోజు రాత్రి తిరుమలలోని గాయత్రి నిలయం అతిథిగృహంలో బస చేయనున్న ఆయన.. రేపు అంటే గురువారం ఉదయం 7.30 గంటలకు సీఎం హోదాలో కుటుంబసమేతంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి అడుగుపెట్టనున్నారు.. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత రంగనాయక మండపంలో వేదపండితుల ఆశీర్వచనం అందుకుంటారు సీఎం చంద్రబాబు.. తిరిగి 8.20 గంటలకు అతిథిగృహానికి చేరుకుని ఉదయం 9 గంటలకు తిరుమల నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.