Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు
- మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
- వీడియో సందేశంలో ప్రతిపక్ష నేత డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది కేవలం ప్రతీకాత్మకమైన రాజీనామా అయినప్పటికీ.. దేశ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణానికి కీలక అడుగుగా అభివర్ణించారు. విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం విడుదల చేసిన వీడియో సందేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంలో ఒక పెద్ద అడుగు. ఆయన ఒక ప్రతీక మాత్రమే. అందుకే ఇది ప్రతీకాత్మక నిర్ణయమే అయినప్పటికీ చాలా ముఖ్యమైనది.’’ అని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విద్యార్థుల నిరంతర ఆందోళనలే కారణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, దేశ భవిష్యత్తు, రాజ్యాంగ పరిరక్షణ కోసం వీధుల్లోకి వచ్చి పోరాడిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలిపారు. ‘‘వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం కోసం, దేశ భవిష్యత్తు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి విద్యార్థికి నా అభినందనలు. మీపై నాకు గర్వంగా ఉంది.’’ అని అన్నారు.
Also Read
- Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్... బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
- August 14, 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
ఈ రాజీనామా రైతులు, కార్మికులు, పేదలు సహా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి వర్గానికి ఒక సందేశమని పేర్కొన్నారు. ‘‘ఈ ప్రభుత్వం అణచివేతకు గురిచేస్తున్న ప్రతి వర్గం ధైర్యంగా పోరాడితే మార్పు సాధ్యమవుతుందని ఈ పరిణామం నిరూపించింది. దేశ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ, సంస్థలను తన ఆధీనంలోకి తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎదుర్కోవాలి.’’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా రెండు కీలక డిమాండ్లను నెరవేర్చాల్సి ఉందన్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్, కాల్పులు, బలప్రయోగానికి పాల్పడిన అధికారులు, వాటిని ఆదేశించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘విద్యార్థులపై చేయి చేసుకున్నవారు, వారిని కొట్టినవారు, కాల్పులకు పాల్పడినవారు, ఈ చర్యలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన ప్రతి ఒక్కరినీ బాధ్యులుగా నిలబెట్టి శిక్షించాలి.’’ అని కోరారు.
మోడీ క్షమాపణ చెప్పాలి
దేశ విద్యార్థుల పట్ల గౌరవం చూపిస్తూ ప్రధాని మోడీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘దేశ భవిష్యత్తైన విద్యార్థులపై జరిగిన అమానుష దాడులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై జరిగిన దాడులకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి.’’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
ట్రెండింగ్
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!