Fibernet Scam Case: చంద్రబాబుకు మరో షాక్.. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fibernet Scam Case: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ నమోదైంది.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ పీటీ వారెంట్ నమోదైంది.. ఫైబర్ నెట్ కేసులో ఈ పీటీ వారెంట్ నమోదు చేశారు.. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఇన్నర్ రింగ్రోడ్ వ్యవహారంలో పీటీ వారెంట్ జారీ చేసింది సీఐడీ.. అయితే, ఇప్పుడు తాజాగా ఫైబర్ నెట్ కేసులోనూ సీఐడీ వర్గాలు పీటీ వారెంట్ నమోదు చేయడం.. దీనిని ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం హాట్ టాపిక్గా మారింది.
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడి పేర్కొంటూ పీటీ వారెంట్ నమోదు చేసింది సీఐడీ.. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.. దాని ద్వారా స్కామ్కు పాల్పడ్డారని.. ఈ వ్యవహారంలో దాదాపు రూ.321 కోట్ల మేర అవకతవకలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోంది.. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ఇప్పటికే 9 మందిని విచారించి.. కొందరిని అరెస్ట్ చేశారు.. ఇప్పుడు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేశారు.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
అయితే, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో వాదనలు ముగిసాయి.. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.. రిమాండ్ రిపోర్ట్ పిటిషన్ పెండింగ్లో ఉంది. మరోవైపు.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కస్టడీ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్, ఇన్నర్ రింగ్రోడ్డు వ్యవహారంలో పీటీ వారెంట్ పెండింగ్లో ఉండగా.. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ నమోదైంది.. అయితే, ఏసీబీ కోర్టు ఆ పిటిషన్లను అన్నింటినీ కలిపి విచారణ జరుపుతుందా? లేదా విడివిడిగా విచారణ జరుపుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక, చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది విజయవాడ ఏసీబీ కోర్టు.. కోర్టు సమయం ముగియడంతో రేపు విచారిస్తామన్నారు న్యాయమూర్తి.. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చాకే బెయిల్ పిటిషన్పై వాదనలు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తంగా.. చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!