CEO Mukesh Kumar: దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈసారి ఆన్ లైన్లో నామినేషన్ ఫారంలు ఫిలప్ చేసుకోవచ్చుని తెలిపింది. కానీ ప్రింటవుట్ తీసుకుని ఆర్వోకు ఫిజికల్ గా అందించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ‘‘ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉంది.
Read Also: Lok Sabha Elections 2024: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటే ఏమిటి..? ఎన్నికల ముందే ఎందుకు..
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
అభ్యర్థులు తమ మీదున్న క్రిమినల్ కేసులను మూడు సార్లు ఫైల్ చేయాల్సి ఉంటుందని సీఈవో ముఖేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సుమారు 4 లక్షల మంది ఉద్యోగులను నియమించాం.. బందోబస్తుకు.. శాంతి భద్రతల నిమిత్తం లక్ష మందికి పైగా అవసరమని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమానస్పద ఖాతాలు.. లావాదేవీలు ఏమైనా ఉన్నాయోమోననే అంశం పైనా బ్యాంకులపై నిఘా పెట్టామని చెప్పారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశాం.. అనుమానస్పద లావాదేవీలపై సమాచారం ఇవ్వాలని సూచించామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతాం.. హెలికాప్టర్లల్లో ప్రయాణిస్తూ ప్రచారం చేస్తారు.. అలాంటి చోట్ల కూడా నిఘా పెట్టాం.. నగదు తరలింపులు హెలికాప్టర్ల ద్వారా జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు ఇప్పటికే పరీక్షించాం.. ఇప్పటి వరకు రూ.164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో ముఖేష్ కుమార్ వెల్లడించారు.
మరోవైపు సీఈవో ముఖేష్ కుమార్ మాట్లాడుతూ.. కోడ్ అమల్లోకి వచ్చింది.. కొత్త పనులు ప్రారంభించకూడదని తెలిపారు. సీఎం, మంత్రుల ఫొటోలు ఉంచకూడదన్నారు. మంత్రులకు ప్రొటోకాల్ ఉండదని పేర్కొన్నారు.. ప్రభుత్వం జారీ చేసే పత్రాలపై నేతల ఫొటోలు ఉండకూడదని చెప్పారు. సంక్షేమ పథకాలు కొనసాగుతాయి.. కొత్త లబ్దిదారుల ఎంపిక ఇకపై చేయకూడదన్నారు. ప్రారంభోత్సవాలు చేయకూడదు.. మతపరమైన కార్యక్రమాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని తెలిపారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు.. ఓ టీమ్ లో ఒక గ్రామ సచివాలయ సిబ్బంది ఉండేలా ఈసీ అనుమతి ఇచ్చిందని తెలిపారు. టీచర్లు లేకుంటే ఎన్నికలు జరగవు.. ఇటీవల జరిగిన బదిలీల్లో కొంత మందిపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. మేం సమాచారం సేకరించాం.. ఈసీఐ దృృష్టికీ తీసుకెళ్లాం.. ఈసీఐ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ తెలిపారు.
Read Also: Chandrababu: జగన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. పోలింగే మిగిలింది.. చంద్రబాబు ట్వీట్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!