AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..
- ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ..
- వివిధ కీలకాంశాలపై చర్చ..
- ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్లో సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. వివిధ కీలకాంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్లో సమీక్ష జరగనుంది.. ఇసుక కొత్త పాలసీ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.. వూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉందని ఇప్పటికే అంచనాకు వచ్చిన ఏపీ ఆర్థిక శాఖ. ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం సభలో బిల్లు పెట్టాలా..? లేదా ఆర్డినెన్స్ జారీ చేయాలా..? అనే అంశంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై చర్చించే అవకాశం ఉండగా.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి..
Read Also: Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
మరోవైపు.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ వేసే అంశంపై కేబినెట్లో ప్రస్తావించనున్నారు.. ఇప్పటికే టీటీడీ విషయంలో ధర్మారెడ్డి, ఐ అండ్ పీఆర్ లో అక్రమాలపై తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వంటి వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే.. వీటితో పాటు.. ఇతర అక్రమాలను సీఐడీకి అప్పగించే ఛాన్స్ ఉండగా.. దీనిపై చర్చించనున్నట్టుగా సమాచారం.. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక ప్రస్తావన చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్.. డయేరియా నివారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చర్చ సాగనుండగా.. శాంతి భద్రతలపై మరింత దృష్టి సారించాలనే దిశగా మంత్రి వర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.. మహిళలు, మైనర్ బాలికల పట్ల లైంగిక వేధింపులను అరికట్టేలా పోలీస్ యంత్రాంగాన్ని పటిష్ట పరిచే దిశగా కేబినెట్లో సమాలోచనలు చేయనున్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, నివారణకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కేబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ANTF.. జిల్లాల్లో కూడా ATNF టీమ్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. వచ్చే నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల పునః ప్రారంభంపై చర్చించనుంది కేబినెట్.. 180కు పైగా అన్న క్యాంటీన్లను ప్రారంభించే అవకాశం ఉంది.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చ సాగనుంది.. మరోవైపు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ఆయన.. వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలుస్తారుని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!