AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణం వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధాన మంత్రి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
ఇక 16వ ఎస్ఐపిబి (SIPB) సమావేశంలో చర్చించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించి రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది. అమరావతిలో “క్వాంటమ్ వ్యాలీ” పరిధిలో మూడు సంస్థల స్థాపనకు కూడా ఆమోదం తెలపనున్నారు. ఇది టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
విద్యా రంగంలో ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ (FRC) ఏర్పాటు ఆర్డినెన్స్కు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా, రాజధాని అమరావతి నిర్మాణంపై సమగ్రంగా చర్చ జరగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పరిపాలనలో భాగంగా 28 జిల్లాలకు జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఇకపై ఉద్యోగ నియామకాలు, బదిలీలు మల్టీ జోన్ మరియు జోనల్ విధానంలో అమలు చేసే దిశగా అడుగులు పడనున్నాయి.
ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియా దుష్ప్రచారం వంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించే అవకాశం ఉంది. మరోవైపు, కూటమి ప్రభుత్వం త్వరలో రెండేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్కు రెడీ!
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!