AP BJP: నేడు బీజేపీ కీలక సమావేశం.. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BJP: ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసిన నేపథ్యంలో.. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ బీజేపీ.. ఇక, ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టింది.. అందులో భాగంగా నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్థార్థనాథ్ సింగ్ హాజరై.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు, అభ్యర్ధులపై బీజేపీ రాష్ట్ర నేతలు చర్చించనున్నారు.. సమావేశంలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శలు, జాతీయ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్న ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఇక, ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్సీబీ కెప్టెన్
Also Read
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ అగ్రనాయకత్వం ఖరారు చేయనుంది.. బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలపై కొంత క్లారిటీ వచ్చింది.. విజయవాడ-వెస్ట్, బద్వేల్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్, ఆదోని, పాడేరు, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాలను కూడా కోరుతున్నారు బీజేపీ నేతలు. అదనంగా రాజంపేట అసెంబ్లీ స్థానం కూడా బీజేపీ నేతలు కోరే అవకాశం ఉందట.. రాజంపేట లోక్సభ పరిధిలో మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికి సుమారు లక్ష ఓట్లు ఉన్నాయి. క్షత్రియ సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయాలంటే రాజులకే (క్షత్రియులు) ఇవ్వాలని డిమాండ్ ఉంది.. టీడీపీ నుంచి అయితే జగన్మోహన్ రాజు, బీజేపీ అయితే చెంగల్ రాజు కు టికెట్ దక్కే అవకాశం ఉందంటున్నారు.. ఇక, రాజమండ్రి-రూరల్ అసెంబ్లీ స్థానం లేదా రాజమండ్రి-అర్బన్ స్థానం నుంచి బీజేపీ పోటీచేయాలని ప్రతిపాదన ఉందట.. తద్వారా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించాలని బీజేపీ ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ రోజు జరిగే కీలక సమావేశంలో పోటీ చేసే స్థానాలతో పాటు.. అభ్యర్థులపై క్లారిటీకి వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?