AP Bar Re-Notification: ఏపీలో మిగిలిపోయిన 432 బార్లకు రీ–నోటిఫికేషన్.. ఈనెల 15న లక్కీ డ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Bar Re-Notification: ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీ 2025–28లో భాగంగా మిగిలిపోయిన 432 బార్లకు ఎక్సైజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 432 బార్లలో 428 ఓపెన్ కేటగిరీ బార్లు, 4 రిజర్వ్ కేటగిరీ గీతకుల బార్లు ఉన్నాయి. సెప్టెంబర్ 14, 2025 సాయంత్రం 6 గంటల వరకు ఉంది దరఖాస్తులు చేసుకోడానికి అవకాశం ఉంది. లక్కీ డ్రా సెప్టెంబర్ 15 ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్లు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా చూస్తే గుంటూరు జిల్లా 67, విశాఖపట్నం 63, ఎన్టీఆర్ జిల్లా 61, నెల్లూరులో 33, పళ్నాడులో 30, తూర్పు గోదావరిలో 16 బార్లు రీ నోటిఫై అయ్యాయి. మిగతా జిల్లాల్లో అనకాపల్లి 2, అనంతపురం 9, కాకినాడ 12, కోనసీమ 9, శ్రీకాకుళం 14, విజయనగరం 15, పశ్చిమ గోదావరి 13 బార్లు సహా మొత్తం 432 బార్లు రీ నోటిఫై అయ్యాయి. మొత్తం జిల్లాల వారీగా ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల అవుతాయి. వాటి ఆధారంగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, SOP ప్రకారం నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
READ ALSO: CM Revanth Reddy : వైఎస్సార్ స్ఫూర్తితోనే మా పాలన.. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీలో 840 బార్లు ఉన్నాయి.. వీటిలో 10 శాతం రిజర్వ్ కేటగిరీలో కల్లు గీత కార్మికులకు 84 బార్లు కేటాయించారు. బార్ల కేటాయింపును పారదర్శకత కోసం లాటరీ విధానం అమలు చేసింది ప్రభుత్వం.. 5 లక్షల ఫీజ్తో నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా ఇవ్వాలి అనే నిబంధన పెట్టారు.. దీంతో పాటు బార్ లకు సరఫరా చేసే మద్యంలో అదనంగా 15 శాతం రిటైల్ సుంకం చెల్లించాల్సి ఉంది.. దీని వల్ల ఒక్కో లైసెన్సికి అదనంగా 30 లక్షలు భారం పడనుంది.. పర్మిట్ రూమ్లకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. 840 బార్లకు కేవలం 466 మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు.. మిగిలిన వాటికి ప్రభుత్వం తాజాగా రీ-నోటిఫికేషన్ జారీ చేసింది.
READ ALSO: Shehbaz Sharif: ఇండియా-రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక కామెంట్స్..
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?