Anushka : సడెన్గా ఇలా షాకి చ్చావేంటి అనుష్క ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka : స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జునతో కలిసి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి సినిమాతో తన నటవిశ్వరూపాన్ని చూపించి.. స్టార్ స్టేటస్ అందుకుంది. అప్పటి నుంచి అనుష్కను జేజమ్మగా పిలవడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. గత ఏడాది నవీన్ పొలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. బాహుబలి తర్వాత ఆమె చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇటీవల మళయాళంలో మొదటి సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కింది. జయసూర్య ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ‘కథనాల్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కింది. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో రోజిన్ థామస్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది.
Read Also:Governor Jishnu Dev Varma: సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..
Also Read
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
సినిమాల సంఖ్య తగ్గించే సరికి ఆమె పెళ్లి చేసేసుకుందని అంతా భావిస్తున్నారు. కానీ అలాంటి షాకింగ్ వార్తలు మాత్రం జేజమ్మ చెప్పడం లేదు. ఇప్పటికే పలుసార్లు అనుష్క పెళ్లి ప్రస్తావనలు వచ్చాయి. ప్రభాస్ తో అంటూ, ఫారిన్లో ఉన్న పారిశ్రామికవేత్తతో అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అనుష్క నా కెరీర్ ఇంకా పూర్తి కాలేదంటూ వరుస సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్తో ఘాటి అనే సినిమా చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ.. అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ ఇప్పుడు ఒకటి కాదు.. అనుష్క రెండు సినిమాలు పూర్తి చేసిందనేలా సడెన్గా షాకింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో అనుష్క ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇక అనుష్క మలయాళంలో కథనార్ అనే మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే చిత్రాలను అనుష్క పూర్తి చేసిందట. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. ఏదయితేనేం ఆఫ్టర్ లాంగ్ టైమ్.. అనుష్క సినిమాలకు సంబంధించి ఇలాంటి వార్త రావడం ప్రేక్షకులకు కూడా సంతోషానిస్తున్నది.
Read Also:RBI: ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానంలో మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి: శక్తికాంత దాస్
తాజావార్తలు
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!