Anushka : సడెన్గా ఇలా షాకి చ్చావేంటి అనుష్క ?
Anushka : స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జునతో కలిసి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి సినిమాతో తన నటవిశ్వరూపాన్ని చూపించి.. స్టార్ స్టేటస్ అందుకుంది. అప్పటి నుంచి అనుష్కను జేజమ్మగా పిలవడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. గత ఏడాది నవీన్ పొలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. బాహుబలి తర్వాత ఆమె చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇటీవల మళయాళంలో మొదటి సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కింది. జయసూర్య ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ‘కథనాల్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కింది. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో రోజిన్ థామస్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది.
Read Also:Governor Jishnu Dev Varma: సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
సినిమాల సంఖ్య తగ్గించే సరికి ఆమె పెళ్లి చేసేసుకుందని అంతా భావిస్తున్నారు. కానీ అలాంటి షాకింగ్ వార్తలు మాత్రం జేజమ్మ చెప్పడం లేదు. ఇప్పటికే పలుసార్లు అనుష్క పెళ్లి ప్రస్తావనలు వచ్చాయి. ప్రభాస్ తో అంటూ, ఫారిన్లో ఉన్న పారిశ్రామికవేత్తతో అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అనుష్క నా కెరీర్ ఇంకా పూర్తి కాలేదంటూ వరుస సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్తో ఘాటి అనే సినిమా చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ.. అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ ఇప్పుడు ఒకటి కాదు.. అనుష్క రెండు సినిమాలు పూర్తి చేసిందనేలా సడెన్గా షాకింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో అనుష్క ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇక అనుష్క మలయాళంలో కథనార్ అనే మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే చిత్రాలను అనుష్క పూర్తి చేసిందట. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. ఏదయితేనేం ఆఫ్టర్ లాంగ్ టైమ్.. అనుష్క సినిమాలకు సంబంధించి ఇలాంటి వార్త రావడం ప్రేక్షకులకు కూడా సంతోషానిస్తున్నది.
Read Also:RBI: ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానంలో మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి: శక్తికాంత దాస్
తాజావార్తలు
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో