NIA Raids: ఖలిస్థానీ-గ్యాంగ్స్టర్స్ దోస్తీపై ఎన్ఐఏ నజర్.. 6 రాష్టాల్లోని 51 ప్రాంతాల్లో దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Raids: భారతదేశంలోని క్రిమినల్ సిండికేట్లు, ఖలిస్థానీ వేర్పాటువాదులు, పాకిస్తాన్, కెనడా వంటి దేశాలలో ఉన్న ఉగ్రవాదుల మధ్య అనుబంధంపై ఎన్ఐఏ పలు రాష్ట్రాల్లో అణిచివేతను ప్రారంభించింది. దేశంలో ఖలిస్థానీలు, గ్యాంగ్స్టర్ల మధ్య సంబంధాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి దోస్తీపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి సారించింది. ఖలిస్థానీలు ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు ఈ నెట్వర్క్లను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్ఐఏ ఏజెన్సీ లారెన్స్ బిష్ణోయ్, అర్ష్దీప్ దల్లా నడుపుతున్న ముఠాలకు సంబంధించిన 50 స్థానాలపై దాడి చేసింది. కొందరు గ్యాంగ్స్టర్స్ పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబాతో సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు భావిస్తున్నారు.
Also Read: Chicken Heating : చికెన్ ను పదే పదే వేడి చేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..
Also Read
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
ఎన్ఐఏ ప్రకారం,అర్ష్దీప్ దల్లా, గౌరవ్ పాటియాల్ వంటి పరారీలో ఉన్న వ్యక్తులు విదేశాల్లో ఉన్నారు. అయితే హత్యలు, దోపిడీ చర్యలకు ఆదేశించడానికి ఖలిస్థాన్ అనుకూల వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ఒక్క పంజాబ్లోనే 30 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ దాడులు క్రిమినల్ సిండికేట్లపై కేసును నిర్మించే ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయి. ఈ క్రిమినల్ సిండికేట్లు ఎక్కువ భాగం ఇప్పుడు దుబాయ్ నుండి నిర్వహించబడుతున్నాయి. గతేడాది ఆగస్టులో ఎన్ఐఏ నమోదు చేసిన మూడు కేసులతో ఈ దాడులు ముడిపడి ఉన్నాయి. ఇవి కెనడాకు చెందిన లఖ్బీర్ సింగ్ అలియాస్ లాండాకు వ్యతిరేకంగా ఉన్నాయి. పాక్కు చెందిన హర్విందర్ సింగ్ రిండా, యునైటెడ్ స్టేట్స్లో ఉన్న సిక్కూస్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్కు వ్యతిరేకంగా ఈ దాడులు జరిగాయి. సోమవారం ఎన్ఐఏ వర్గాలు పన్నూన్పై ఉన్న రిపోర్టు వివరాలను వెల్లడించాయి, అందులో పన్నూన్ భారతదేశాన్ని విభజించడం ద్వారా దేశాలను సృష్టించాలనుకుంటున్నాడని ఎన్ఐఏ వెల్లడించింది.
Also Read: LJP Leader: ఎల్జేపీ నేత దారుణ హత్య.. బైక్పై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు
లారెన్స్ బిష్ణోయ్, గ్యాంగ్స్టర్ బాస్లు గోల్డీ బ్రార్, విక్రమ్ బ్రార్లతో పాటు వారి ప్రత్యర్థులు బంబిహా, కౌశల్ చౌదరి, నీరజ్ బవానా, దిల్ప్రీత్, సుఖ్ప్రీత్ అలియాస్ బుధాపై కూడా కేసులు నమోదయ్యాయి. మేలో ఢిల్లీలోని తీహార్ జైలులో పోలీసులు నిలబడి చూస్తుండగానే హత్యకు గురైన సునీల్ అలియాస్ టిల్లు తాజ్పురియా, 2016లో పంజాబ్లో జరిగిన ఎన్కౌంటర్లో కాల్చి చంపబడిన బంబిహాపై కూడా కేసులు ఉన్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద చండీగఢ్, అమృత్సర్లో పన్నూన్కు చెందిన ఆస్తులను కూడా ఎన్ఐఏ గత వారం జప్తు చేసింది. ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడం, కమీషన్ చేయడం వంటి ఆరోపణలపై 2019 నుండి వెతుకుతున్న పన్నూన్, పంజాబ్లోనే మూడు దేశద్రోహంతో సహా 22 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడు. రెండు రోజుల ముందు ఎన్ఐఏ పంజాబ్, హర్యానా అంతటా 1,000 స్థానాలపై దాడి చేసింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు ప్లాన్ చేసిన గోల్డీ బ్రార్తో ఇవి ముడిపడి ఉన్నాయి. గోల్డీ బ్రార్ భారతదేశానికి కావాల్సిన ‘మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్’లో ఉన్నాడు. కెనడాలోని విన్నిపెగ్లో కాల్చి చంపబడిన ప్రత్యర్థి క్రైమ్ బాస్ సుఖా డునికే హత్య వెనుక కూడా గోల్డీ బ్రార్ ఉన్నారని సమాచారం.
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!