TGANB : డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రతిజ్ఞ.. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ప్రారంభం
- యాంటీ డ్రగ్ వీక్ ప్రారంభం
- విద్యార్థుల ప్రమాణ స్వీకారం
- "డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ" లక్ష్యంగా ముందుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGANB : తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పోరుకు ఒక ముఖ్యమైన అడుగు వేయడంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూన్ 21 నుండి 26 వరకు జరగనున్న ఈ వారోత్సవాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవ లక్ష్యం.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
Data Leak: సామాన్యుడైన.. దేశాధినేతైనా.. ఎవరి ఫోన్కీ భద్రత లేదా?
TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య విద్యార్థులతో ప్రత్యేకంగా యాంటీ డ్రగ్ సోల్జర్గా ప్రమాణం చేయించారు. “మాదకద్రవ్యాల జోలికి వెళ్లం, డ్రగ్స్ వ్యతిరేకంగా పని చేస్తాం” అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హరిచందన మాట్లాడుతూ, “సే నో టు డ్రగ్స్ అనే నినాదం ప్రతి ఒక్కరిదాకా చేరేలా చూడాలి” అని పిలుపునిచ్చారు.
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. “డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ” కోసం ప్రభుత్వం, పోలీస్ విభాగం కృతనిశ్చయంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. “డ్రగ్స్ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. యువత డ్రగ్స్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులే సమాజ మార్పు కారకులు” అన్నారు.
విద్యార్థులే తమ జీవితం అనే పుస్తకాన్ని మంచి విషయాలతో తమను తాము పూర్తిగా రాయాలని సూచించారు. “ఒక విద్యార్థి కనీసం పది మందికి ‘సే నో టు డ్రగ్స్’ అనే సందేశాన్ని అందించాలి” అని సూచించారు.
ఈ వారోత్సవాల్లో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో డ్రగ్స్ పై అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రతిజ్ఞ సంఘటనలు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించనున్నారు. “పాఠశాలల్లో ఎక్కడైనా నార్కోటిక్ పదార్థాలు ఉంటే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని అధికారులు సూచించారు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో ప్రారంభమైన ఈ అవగాహన వారోత్సవం యువతలో కొత్త చైతన్యం నింపనుంది. ప్రభుత్వ, పోలీస్, విద్యా సంస్థల కృషితో తెలంగాణను డ్రగ్స్ నుంచి విముక్తి చేయడం ఇప్పుడు అందరి కల.
Amit Shah : పాక్ నీటి కొరతకు సిద్ధంగా ఉండాలి.. సింధూ జలాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!