TGANB : డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రతిజ్ఞ.. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ప్రారంభం
- యాంటీ డ్రగ్ వీక్ ప్రారంభం
- విద్యార్థుల ప్రమాణ స్వీకారం
- "డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ" లక్ష్యంగా ముందుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGANB : తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పోరుకు ఒక ముఖ్యమైన అడుగు వేయడంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూన్ 21 నుండి 26 వరకు జరగనున్న ఈ వారోత్సవాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవ లక్ష్యం.
Also Read
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
Data Leak: సామాన్యుడైన.. దేశాధినేతైనా.. ఎవరి ఫోన్కీ భద్రత లేదా?
TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య విద్యార్థులతో ప్రత్యేకంగా యాంటీ డ్రగ్ సోల్జర్గా ప్రమాణం చేయించారు. “మాదకద్రవ్యాల జోలికి వెళ్లం, డ్రగ్స్ వ్యతిరేకంగా పని చేస్తాం” అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హరిచందన మాట్లాడుతూ, “సే నో టు డ్రగ్స్ అనే నినాదం ప్రతి ఒక్కరిదాకా చేరేలా చూడాలి” అని పిలుపునిచ్చారు.
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. “డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ” కోసం ప్రభుత్వం, పోలీస్ విభాగం కృతనిశ్చయంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. “డ్రగ్స్ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. యువత డ్రగ్స్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులే సమాజ మార్పు కారకులు” అన్నారు.
విద్యార్థులే తమ జీవితం అనే పుస్తకాన్ని మంచి విషయాలతో తమను తాము పూర్తిగా రాయాలని సూచించారు. “ఒక విద్యార్థి కనీసం పది మందికి ‘సే నో టు డ్రగ్స్’ అనే సందేశాన్ని అందించాలి” అని సూచించారు.
ఈ వారోత్సవాల్లో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో డ్రగ్స్ పై అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రతిజ్ఞ సంఘటనలు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించనున్నారు. “పాఠశాలల్లో ఎక్కడైనా నార్కోటిక్ పదార్థాలు ఉంటే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని అధికారులు సూచించారు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో ప్రారంభమైన ఈ అవగాహన వారోత్సవం యువతలో కొత్త చైతన్యం నింపనుంది. ప్రభుత్వ, పోలీస్, విద్యా సంస్థల కృషితో తెలంగాణను డ్రగ్స్ నుంచి విముక్తి చేయడం ఇప్పుడు అందరి కల.
Amit Shah : పాక్ నీటి కొరతకు సిద్ధంగా ఉండాలి.. సింధూ జలాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!