TGANB : డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రతిజ్ఞ.. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ప్రారంభం
- యాంటీ డ్రగ్ వీక్ ప్రారంభం
- విద్యార్థుల ప్రమాణ స్వీకారం
- "డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ" లక్ష్యంగా ముందుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGANB : తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పోరుకు ఒక ముఖ్యమైన అడుగు వేయడంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూన్ 21 నుండి 26 వరకు జరగనున్న ఈ వారోత్సవాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవ లక్ష్యం.
Also Read
Data Leak: సామాన్యుడైన.. దేశాధినేతైనా.. ఎవరి ఫోన్కీ భద్రత లేదా?
TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య విద్యార్థులతో ప్రత్యేకంగా యాంటీ డ్రగ్ సోల్జర్గా ప్రమాణం చేయించారు. “మాదకద్రవ్యాల జోలికి వెళ్లం, డ్రగ్స్ వ్యతిరేకంగా పని చేస్తాం” అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హరిచందన మాట్లాడుతూ, “సే నో టు డ్రగ్స్ అనే నినాదం ప్రతి ఒక్కరిదాకా చేరేలా చూడాలి” అని పిలుపునిచ్చారు.
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. “డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ” కోసం ప్రభుత్వం, పోలీస్ విభాగం కృతనిశ్చయంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. “డ్రగ్స్ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. యువత డ్రగ్స్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులే సమాజ మార్పు కారకులు” అన్నారు.
విద్యార్థులే తమ జీవితం అనే పుస్తకాన్ని మంచి విషయాలతో తమను తాము పూర్తిగా రాయాలని సూచించారు. “ఒక విద్యార్థి కనీసం పది మందికి ‘సే నో టు డ్రగ్స్’ అనే సందేశాన్ని అందించాలి” అని సూచించారు.
ఈ వారోత్సవాల్లో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో డ్రగ్స్ పై అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రతిజ్ఞ సంఘటనలు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించనున్నారు. “పాఠశాలల్లో ఎక్కడైనా నార్కోటిక్ పదార్థాలు ఉంటే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని అధికారులు సూచించారు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో ప్రారంభమైన ఈ అవగాహన వారోత్సవం యువతలో కొత్త చైతన్యం నింపనుంది. ప్రభుత్వ, పోలీస్, విద్యా సంస్థల కృషితో తెలంగాణను డ్రగ్స్ నుంచి విముక్తి చేయడం ఇప్పుడు అందరి కల.
Amit Shah : పాక్ నీటి కొరతకు సిద్ధంగా ఉండాలి.. సింధూ జలాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!