TGANB : డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రతిజ్ఞ.. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ప్రారంభం
- యాంటీ డ్రగ్ వీక్ ప్రారంభం
- విద్యార్థుల ప్రమాణ స్వీకారం
- "డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ" లక్ష్యంగా ముందుకు..
TGANB : తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పోరుకు ఒక ముఖ్యమైన అడుగు వేయడంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూన్ 21 నుండి 26 వరకు జరగనున్న ఈ వారోత్సవాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవ లక్ష్యం.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
Data Leak: సామాన్యుడైన.. దేశాధినేతైనా.. ఎవరి ఫోన్కీ భద్రత లేదా?
TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య విద్యార్థులతో ప్రత్యేకంగా యాంటీ డ్రగ్ సోల్జర్గా ప్రమాణం చేయించారు. “మాదకద్రవ్యాల జోలికి వెళ్లం, డ్రగ్స్ వ్యతిరేకంగా పని చేస్తాం” అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హరిచందన మాట్లాడుతూ, “సే నో టు డ్రగ్స్ అనే నినాదం ప్రతి ఒక్కరిదాకా చేరేలా చూడాలి” అని పిలుపునిచ్చారు.
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. “డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ” కోసం ప్రభుత్వం, పోలీస్ విభాగం కృతనిశ్చయంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. “డ్రగ్స్ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. యువత డ్రగ్స్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులే సమాజ మార్పు కారకులు” అన్నారు.
విద్యార్థులే తమ జీవితం అనే పుస్తకాన్ని మంచి విషయాలతో తమను తాము పూర్తిగా రాయాలని సూచించారు. “ఒక విద్యార్థి కనీసం పది మందికి ‘సే నో టు డ్రగ్స్’ అనే సందేశాన్ని అందించాలి” అని సూచించారు.
ఈ వారోత్సవాల్లో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో డ్రగ్స్ పై అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రతిజ్ఞ సంఘటనలు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించనున్నారు. “పాఠశాలల్లో ఎక్కడైనా నార్కోటిక్ పదార్థాలు ఉంటే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని అధికారులు సూచించారు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో ప్రారంభమైన ఈ అవగాహన వారోత్సవం యువతలో కొత్త చైతన్యం నింపనుంది. ప్రభుత్వ, పోలీస్, విద్యా సంస్థల కృషితో తెలంగాణను డ్రగ్స్ నుంచి విముక్తి చేయడం ఇప్పుడు అందరి కల.
Amit Shah : పాక్ నీటి కొరతకు సిద్ధంగా ఉండాలి.. సింధూ జలాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?