TGANB : డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రతిజ్ఞ.. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ప్రారంభం
- యాంటీ డ్రగ్ వీక్ ప్రారంభం
- విద్యార్థుల ప్రమాణ స్వీకారం
- "డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ" లక్ష్యంగా ముందుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGANB : తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పోరుకు ఒక ముఖ్యమైన అడుగు వేయడంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూన్ 21 నుండి 26 వరకు జరగనున్న ఈ వారోత్సవాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవ లక్ష్యం.
Also Read
Data Leak: సామాన్యుడైన.. దేశాధినేతైనా.. ఎవరి ఫోన్కీ భద్రత లేదా?
TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య విద్యార్థులతో ప్రత్యేకంగా యాంటీ డ్రగ్ సోల్జర్గా ప్రమాణం చేయించారు. “మాదకద్రవ్యాల జోలికి వెళ్లం, డ్రగ్స్ వ్యతిరేకంగా పని చేస్తాం” అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హరిచందన మాట్లాడుతూ, “సే నో టు డ్రగ్స్ అనే నినాదం ప్రతి ఒక్కరిదాకా చేరేలా చూడాలి” అని పిలుపునిచ్చారు.
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. “డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ” కోసం ప్రభుత్వం, పోలీస్ విభాగం కృతనిశ్చయంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. “డ్రగ్స్ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. యువత డ్రగ్స్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులే సమాజ మార్పు కారకులు” అన్నారు.
విద్యార్థులే తమ జీవితం అనే పుస్తకాన్ని మంచి విషయాలతో తమను తాము పూర్తిగా రాయాలని సూచించారు. “ఒక విద్యార్థి కనీసం పది మందికి ‘సే నో టు డ్రగ్స్’ అనే సందేశాన్ని అందించాలి” అని సూచించారు.
ఈ వారోత్సవాల్లో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో డ్రగ్స్ పై అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రతిజ్ఞ సంఘటనలు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించనున్నారు. “పాఠశాలల్లో ఎక్కడైనా నార్కోటిక్ పదార్థాలు ఉంటే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని అధికారులు సూచించారు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో ప్రారంభమైన ఈ అవగాహన వారోత్సవం యువతలో కొత్త చైతన్యం నింపనుంది. ప్రభుత్వ, పోలీస్, విద్యా సంస్థల కృషితో తెలంగాణను డ్రగ్స్ నుంచి విముక్తి చేయడం ఇప్పుడు అందరి కల.
Amit Shah : పాక్ నీటి కొరతకు సిద్ధంగా ఉండాలి.. సింధూ జలాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?