Amit Shah : పాక్ నీటి కొరతకు సిద్ధంగా ఉండాలి.. సింధూ జలాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- సింధూ జలాలపై భారత్ తుది నిర్ణయం
- పాకిస్థాన్కి నీటి కొరత తప్పదు
- కెనాల్ ద్వారా నీటి మళ్లింపు
- రాజస్థాన్కు లాభం, పాక్కు దెబ్బ : అమిత్ షా
Amit Shah : సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఈ ఒప్పంద నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా భారత నీటిని వాడుక చేసిందని, ఇకపై ఆ దేశం నీటి కొరతకు ఎదురుకావాల్సిందేనని హెచ్చరించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒప్పందాలను తులతూలకుండా రద్దు చేయలేమని, కానీ సింధూ ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు మాత్రం భారత్కు ఉంది. అదే చేశామని అని వివరించారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం శాంతి, పురోగతి లక్ష్యాలతో ఏర్పడిందని, అయితే పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘించిన వేళ భారత నిర్ణయం తగినదేనని పేర్కొన్నారు.
Kubera : ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్స్ను లాక్ చేసుకున్న ‘కుబేర’..
Also Read
- jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
భారతదేశానికి హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కెనాల్ నిర్మాణం ద్వారా పాకిస్థాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామని, పాకిస్థాన్ అన్యాయంగా ఉపయోగించుకున్న నీటి ప్రవాహం ఇక ఆ దేశానికి అందదని అని షా చెప్పారు. పాకిస్థాన్ వ్యవసాయం, నీటి వనరులు అత్యధికంగా సింధూ నదులపై ఆధారపడిన నేపథ్యంలో, భారత్ తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. 80 శాతం వ్యవసాయ నీరు ఈ ఒప్పందం ద్వారానే లభించేది. పాక్ జీడీపీలో సింధూ జలాల వాటా 25 శాతమని చూస్తే, భారత్ తాజా విధానం ఆర్ధికంగా ఎంతగానో ప్రభావం చూపనుందని అర్థమవుతుంది.
ఈ సందర్భంగా అమిత్ షా, నియోజకవర్గాల పునర్విభజనపై కూడా మాట్లాడారు. “ఇందుకు ఎవరూ ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. సమతుల్యతతో ప్రక్రియ కొనసాగుతుంది. 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే ఈ అంశాన్ని వ్యతిరేకిస్తోంది,” అని ఆయన విమర్శించారు. అలాగే, మహిళా రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ, “2029లో జరగబోయే లోక్సభ ఎన్నికలు మహిళలకు 33 శాతం రిజర్వేషన్తోనే జరగబోతున్నాయి,” అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!