Amit Shah : పాక్ నీటి కొరతకు సిద్ధంగా ఉండాలి.. సింధూ జలాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- సింధూ జలాలపై భారత్ తుది నిర్ణయం
- పాకిస్థాన్కి నీటి కొరత తప్పదు
- కెనాల్ ద్వారా నీటి మళ్లింపు
- రాజస్థాన్కు లాభం, పాక్కు దెబ్బ : అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah : సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఈ ఒప్పంద నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా భారత నీటిని వాడుక చేసిందని, ఇకపై ఆ దేశం నీటి కొరతకు ఎదురుకావాల్సిందేనని హెచ్చరించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒప్పందాలను తులతూలకుండా రద్దు చేయలేమని, కానీ సింధూ ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు మాత్రం భారత్కు ఉంది. అదే చేశామని అని వివరించారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం శాంతి, పురోగతి లక్ష్యాలతో ఏర్పడిందని, అయితే పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘించిన వేళ భారత నిర్ణయం తగినదేనని పేర్కొన్నారు.
Kubera : ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్స్ను లాక్ చేసుకున్న ‘కుబేర’..
Also Read
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
భారతదేశానికి హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కెనాల్ నిర్మాణం ద్వారా పాకిస్థాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామని, పాకిస్థాన్ అన్యాయంగా ఉపయోగించుకున్న నీటి ప్రవాహం ఇక ఆ దేశానికి అందదని అని షా చెప్పారు. పాకిస్థాన్ వ్యవసాయం, నీటి వనరులు అత్యధికంగా సింధూ నదులపై ఆధారపడిన నేపథ్యంలో, భారత్ తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. 80 శాతం వ్యవసాయ నీరు ఈ ఒప్పందం ద్వారానే లభించేది. పాక్ జీడీపీలో సింధూ జలాల వాటా 25 శాతమని చూస్తే, భారత్ తాజా విధానం ఆర్ధికంగా ఎంతగానో ప్రభావం చూపనుందని అర్థమవుతుంది.
ఈ సందర్భంగా అమిత్ షా, నియోజకవర్గాల పునర్విభజనపై కూడా మాట్లాడారు. “ఇందుకు ఎవరూ ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. సమతుల్యతతో ప్రక్రియ కొనసాగుతుంది. 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే ఈ అంశాన్ని వ్యతిరేకిస్తోంది,” అని ఆయన విమర్శించారు. అలాగే, మహిళా రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ, “2029లో జరగబోయే లోక్సభ ఎన్నికలు మహిళలకు 33 శాతం రిజర్వేషన్తోనే జరగబోతున్నాయి,” అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?