AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం..!
- ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం..
- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు..
- ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ..
- లిక్కర్ కేసులో A-39గా ఉన్న మోహిత్ రెడ్డి..
- మంగళవారం మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. మోహిత్ రెడ్డిని A-39గా చేర్చారు సిట్ అధికారులు. లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్ట్ చేసింది సిట్. వారంతా విజయవాడ జైల్లో ఉన్నారు. గత వారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అధికారులు… ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించి అతడిని కూడా నిందితుడిగా చేర్చారు. దీంతో మోహిత్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మంగళవారం విచారణకి రానున్న నేపథ్యంలో మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది.
Read Also: Ponguleti Srinivasa Reddy: వ్యవసాయం దండగ కాదు.. పండగ అని చెబుతున్నాం..
Also Read
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఈనెల 25న విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది సిట్. మరోవైపు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ ప్రత్యేక బృందాలు బెంగళూరు, హైదరాబాద్లలో గాలిస్తున్నాయి. ఒకవైపు విచారణకు రావాలని నోటీసులు, మరోవైపు అరెస్టు చేయడం కోసం ప్రత్యేక బృందాల గాలింపు చర్యలతో వ్యవహారం రచ్చగా మారింది. ఇక నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం చెవిరెడ్డి కస్టడీ పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్ను కూడా ఏసీబీ కోర్టు విచారించనుంది.
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?