Annamalai: తమిళనాడు రాజకీయాల్లో అన్నామలైకి అపూర్వ మద్దతు లభిస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే ఆయన రాజకీయ ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బీజేపీకి అధికారికంగా రాజీనామా చేసిన తర్వాత దాదాపుగా 14 లక్షల మంది ఆయన ప్రారంభించిన ఉద్యమంలో చేరారు. జూన్ 5న బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై, కొత్తగా రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై, తనకు పార్టీతో 18 నెలలుగా విభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాలపై తన అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయాలు ఒకేలా ఉండవని చెప్పారు. తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రజా కేంద్రిత రాజకీయల కొత్తదశగా అన్నామలై పేర్కొన్నారు. యువత, సాధారణ ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు కొద్ది మంది కుటుంబాలకో, శాశ్వత ఎమ్మెల్యేలు, ఎంపీలకో పరిమిత కాకూడదని, రాజకీయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. వ్యక్తిపూజ, వంశపారంపర్య రాజకీయాలను ముగించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
అన్నామలై ప్రారంభించిన ‘‘వి ద లీడర్’’ అనే రాజకీయ ఉద్యమానికి అపూర్వ స్పందన వస్తోంది. ఈ ఉద్యమానికి సంబంధించిన వెబ్సైట్ ప్రకారం.. 14 లక్షల మంది సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విద్యా, ఆరోగ్యం, పర్యావరణం, యువ నాయకత్వం వంటి రంగాల్లో సేవ చేయాలనుకున స్వచ్ఛంద కార్యకర్తలను ఈ ఉద్యమం ఆహ్వానిస్తుంది. కొత్త ఉద్యమం ద్వారా తమిళనాడులో జరిగే తదుపరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నామలై ప్రకటించారు.

