Anju Nasrullah Love Story: అంజు కేసులో కొత్త ట్విస్ట్.. అంజు, నస్రుల్లాపై అరవింద్ పోలీసులకు ఫిర్యాదు
Anju Nasrullah Love Story: రాజస్థాన్లోని భివాడి నుంచి తన ఫేస్బుక్ ప్రేమికుడి కోసం పాకిస్థాన్కు చేరుకున్న అంజు.. మరోసారి వార్తల్లో నిలిచింది. అంజును పాకిస్థాన్కు తీసుకెళ్లేందుకు ప్రేరేపించారని ఆమె భర్త అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అరవింద్ వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంజు పాకిస్థాన్ వెళ్లిన 15 రోజుల తర్వాత ఇప్పుడు అంజు భర్త అరవింద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. తన భార్య అంజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. పెళ్లి చేసుకున్నప్పటికీ రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిందని, పాకిస్థాన్ నుంచి వాట్సాప్ కాల్ చేసి బెదిరించిందని అరవింద్ అంజుపై కేసు పెట్టాడు.
Also Read: Nuh Violence: నూహ్లో మూడో రోజు బుల్డోజర్ యాక్షన్.. మెడికల్ షాపులు, దుకాణాలు కూల్చివేత
Also Read
భివాడి ఏఎస్పీ సుజిత్ శంకర్ మాట్లాడుతూ.. ”అంజూని పాకిస్థాన్ వెళ్లేలా ప్రేరేపించారని ఆరోపిస్తూ ఆమె భర్త అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఐపీసీ, ఐటీ యాక్ట్ సెక్షన్లు 366, 494, 500, 506 కింద అంజుపై కేసు నమోదు చేశామని తెలిపారు. నస్రుల్లా పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉందన్నారు. అంజు విడాకులు తీసుకోకుండానే పాకిస్థాన్ వెళ్లి నస్రుల్లాను పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే అంజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతే కాకుండా పాకిస్థాన్ నుంచి కూడా అంజు మొబైల్లో బెదిరించింది. పాక్ మీడియా కథనాల ప్రకారం, అంజు పాకిస్థాన్లో మతం మార్చుకుని తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఆమె నస్రుల్లాను వివాహం కూడా చేసుకుంది. ఇప్పుడు అంజు వీసాను మరో రెండు నెలలు పొడిగించినట్లు సమాచారం. విడాకులు తీసుకోకుండా పెళ్లి, నస్రుల్లా తప్పుడు కలలు చూపించాడని అంజు భర్త అరవింద్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. నస్రుల్లా నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని అరవింద్ నివేదికలో పేర్కొన్నాడు. ఈ ఘటన మానసిక క్షోభకు గురి చేసిందని, నస్రుల్లాపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని అరవింద్ డిమాండ్ చేశాడు. అంజు జూలై 21న భివాడి నుంచి పాకిస్థాన్కు చేరుకుంది. అప్పటి నుంచి ఆమె ఖైబర్ పఖ్తుంఖ్వాలోని నస్రుల్లా ఇంట్లో నివసిస్తోంది.
Also Read: Health Tips: డిస్పోజబుల్ కప్పుల్లో తాగుతున్నారా? ప్రాణాలు పోయినట్లే..
జైపూర్ అని చెప్పి అంజు పాకిస్థాన్కు చేరుకుందని అంజు భర్త అరవింద్ కొంతకాలం క్రితం చెప్పాడు. అరవింద్ మాట్లాడుతూ.. “నా భార్య నాతో అబద్ధం చెప్పి భివాడి నుంచి పాకిస్తాన్ చేరుకుంది. ఆమె తన స్నేహితుడిని చూడటానికి జైపూర్ వెళుతున్నట్లు నాకు చెప్పింది. నేను ఆమెతో 4 రోజులు వాట్సాప్ ద్వారా మాట్లాడాను, కాని ఆదివారం జైపూర్ కాకుండా ఆమె పాకిస్థాన్ చేరుకుందని తెలిసింది” అని అరవింద్ చెప్పాడు. తనకు అంజుతో 2007లో పెళ్లయిందని, అప్పటి నుంచి తాను, అంజు సహజీవనం చేస్తున్నామని అరవింద్ చెప్పాడు. వీరిద్దరూ భివాడిలోని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారు, వీరికి 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తానని చెప్పి 2020లోనే అంజు పాస్పోర్ట్ను తయారు చేసుకుంది.
వాస్తవానికి, అంజు పాకిస్తాన్ చేరుకున్న తర్వాత తన ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాను వివాహం చేసుకుంది. వారి చిత్రాలు, వీడియోలు నిరంతరం బయటకు వస్తున్నాయి. పాక్ మీడియా కథనాల ప్రకారం, అంజు పాకిస్థాన్లో మతం మార్చుకుని నస్రుల్లాను వివాహం చేసుకుంది. వారిద్దరికీ సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇందులో ఇద్దరూ కలిసి నడుస్తూ ఆహారం తింటున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?