Big Breaking: ఏపీ ప్రభుత్వం తరపున అంగన్వాడీలకు జీవోఎం విజ్ఞప్తి చేస్తూ బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anganwadi workers Protest: అంగన్వాడీల ఆందోళనల నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బహిరంగ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి అంగన్వాడీలకు విఙప్తి చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో అంగన్వాడీలకు ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాలను పెంచామని తెలిపింది. మంచి పని తీరు కనబరిచిన వర్కర్లకు ప్రోత్సాహకాలు కూడా అందించాం.. ప్రోత్సాహకాల రూపంలో 27.8 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించింది.. ప్రమోషన్ల విషయంలోనూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేర్కొనింది.
Read Also: Nabhi Marma Benefits: చలికాలంలో శరీరం వెచ్చదనం కోసం ‘నాభి మర్మం’.. అంటే ఏంటో తెలుసా?
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
వివిధ సంక్షేమ పథకాల కింద అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు డీబీటీ ద్వారా 1,313 కోట్ల రూపాయలు అందించాము అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బహిరంగ లేఖలో తెలిపారు. నవరత్నాలు కార్యక్రమాల కింద అంగన్వాడీలకు వివిధ పథకాలు జగనన్న విద్యా దీవెన, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా వంటివి అందిస్తున్నాం.. అంగన్వాడీ వర్కర్లు వారి విధులు సక్రమంగా నిర్వహించేందుకు 56 వేల 984 స్మార్ట్ ఫోన్లు అందించాం.. వీటి కోసం ప్రభుత్వం 85.47 కోట్లు వెచ్చించింది.. డేటా ఖర్చుల కోసం ఏడాదికి 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పేర్కొనింది. ఈ ఏడాది నుంచి అంగన్వాడి హెల్పర్లు, సహాయకులకు జీవిత బీమా కూడా ప్రభుత్వం అందిస్తోంది.. తాజాగా ప్రభుత్వం చేసిన పలు హామీలను కూడా ఈ లేఖలో జీవోఎం ప్రస్తావించింది. మీ కోర్కెల సాధనకు చేస్తున్న ఆందోళనలను కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గమనించాలి అని చెప్పింది.
Read Also: Jhansi: యాంకర్ ఇంట్లో విషాదం.. సలార్ ఓబులమ్మ ఎమోషనల్
ఈ ప్రభుత్వం మీది, మన అందరిదీ అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేర్కొనింది. మీరంతా మా వాళ్లు మీకు మరింత మంచి చేయాలనేదే మా తపన.. మీ న్యాయమైన కోరికలు తీర్చడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.. గర్భీణులు, బాలింతలు, చిన్నారుల ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించాలని కోరుతున్నాం.. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యం.. గర్భీణులు, బాలింతలు, పసి పిల్లల బాధ్యత మరింత కీలకం.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూసుకునే పరిస్థితి తీసుకుని రావొద్దని కోరుతున్నాం.. సమ్మె నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామని జీవోఎం తెలిపింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!