Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Charani: మహిళల క్రికెట్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అద్భుతమైన రోజిది. భారత యువ స్పిన్ సంచలనం శ్రీ చరణి కెరీర్లో మరో మైలురాయి నమోదైంది. క్రికెట్ కాశీగా పిలిచే లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న చరిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం (డెబ్యూ) చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చేతుల మీదుగా ఏపీకి చెందని కడప బిడ్డ శ్రీ చరణి టెస్ట్ క్యాప్ అందుకోవడం విశేషం.
నిజానికి లార్డ్స్ మైదానంలో పురుషుల టెస్ట్ మ్యాచ్లు 1884 నుంచే జరుగుతున్నా.. మహిళల అంతర్జాతీయ మ్యాచ్ జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఇక్కడ తొలిసారి ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. ఈ అరుదైన మ్యాచ్తోనే 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగుపెట్టడం విశేషం. ఇక, ఇటీవల ముగిసిన మహిళల టీ20 వరల్డ్ కప్లో మన కడప బిడ్డ శ్రీ చరణి అద్భుత ప్రదర్శన చేసింది. కేవలం 5 మ్యాచ్ల్లోనే 14 వికెట్లు పడగొట్టి, ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించింది. గతంలో 2020లో పూనమ్ యాదవ్ (10 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును చరణి బద్దలు కొట్టింది. ఓవరాల్గా వరల్డ్ కప్ చరిత్రలోనే ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్ (15 వికెట్లు) తర్వాత చరణి రెండో స్థానంలో నిలిచింది. ఈ సంచలన ప్రదర్శనతోనే ఆమె ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1 బౌలర్గా ఎదగడమే కాకుండా, ఇప్పుడు టెస్ట్ జట్టులోనూ చోటు సంపాదించుకుంది.
Also Read
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
- Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
- BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
- YSRCP: ముదురుతోన్న డీఎస్సీ వివాదం.. ఉద్యమ బాటలో వైసీపీ.. కార్యాచరణ ప్రకటన
జట్టులోకి యాస్తికా భాటియా పునరాగమనం:
మరోవైపు, గాయం కారణంగా 2024లో దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టుకు, అలాగే ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్టుకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా.. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ భారత టెస్ట్ జట్టులోకి తిరిగొచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు కూడా తమ ఆటగాళ్లు మేడీ విలియర్స్, అలిస్ క్యాప్సేలకు తొలిసారి టెస్ట్ క్యాప్లు అందించింది.
ఇరు జట్ల వివరాలు:
భారత మహిళల జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సయాలీ సత్ఘరే, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
ఇంగ్లాండ్ మహిళల జట్టు: టామీ బ్యూమౌంట్, మాయా బూషియర్, హీథర్ నైట్, నాట్ సివర్ బ్రంట్ (కెప్టెన్), అలిస్ క్యాప్సే, అమీ జోన్స్ (వికెట్ కీపర్), మేడీ విలియర్స్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్, లారెన్ బెల్, లారెన్ ఫిలర్.
తాజావార్తలు
-
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
-
Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!
-
Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!
-
Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
-
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!