Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Andhra Pradesh Clears 20216 Cr Investments Under Sipb Four Mega Projects To Create Over 50000 Jobs

SIPB: ఏపీలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి రూ.20,216 కోట్ల పెట్టుబడులు.. నాలుగు భారీ ప్రాజెక్టులు ఆమోదం..!

Published Date :July 25, 2025 , 9:10 am
By Kothuru Ram Kumar
SIPB: ఏపీలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి రూ.20,216 కోట్ల పెట్టుబడులు.. నాలుగు భారీ ప్రాజెక్టులు ఆమోదం..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

SIPB: సీఎం చంద్రబాబు మార్గదర్శంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్తగా రూ.20,216 కోట్ల విలువైన నాలుగు భారీ ప్రాజెక్టులు రానున్నాయి. దీంతో దాదాపు 50,600 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తొమ్మిదవ రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్, సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, ఎఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సంస్థలు డిజిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రెసిడెన్షియల్, సేవల రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని SIPB ప్రకటించింది.

Mrunal Thakur : అమ్మని కావాలనుంది.. కానీ – మృణాళ్ ఎమోషనల్

Also Read

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
  • Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
Add as a preferred
source on google

ఈ సమావేశం అనంతరం అందిన నివేదిక ప్రకారం.. సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ రూ.16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండగా.. మొదటి దశలో రూ.1,466 కోట్లు, రెండో దశలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ డేటా, డిజిటల్ సేవల రంగంలో కీలక పురోగతి సాధిస్తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అలాగే, సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,500 కోట్లతో విశాఖపట్నం, మధురవాడ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టనుంది. ఈ అంశం రాష్ట్రంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కొత్త ఊపును తీసుకరానుంది.

మరోవైపు, బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,250 కోట్లతో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును ప్లాన్ చేయనుంది. దిహినితో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ విస్తరణకు కీలకంగా మారనుంది. అలాగే, ఎఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ ఏకంగా రూ.1,000 కోట్లతో విశాఖపట్నం, మధురవాడలో సేవల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి సేవల రంగాన్ని ముందుకు తీసుకపోనున్నాయి.

IND vs ENG: పంత్‌ స్థానంలో తమిళనాడు కీపర్‌కు పిలుపు.. ఇషాన్‌ కిషన్‌ను ఏమైంది?!

ఇప్పటి వరకు SIPB ద్వారా మొత్తం 113 ప్రాజెక్టులకు సంబంధించి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇవి రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాలు పెంచుతున్నాయని పేర్కొంది. ఇది ఇలా ఉండగా.. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన ఉండవల్లి నివాసంలో నివహించిన సమీక్షా సమావేశంలో.. మంగళగిరిని ఐటీ, ఐటీయేతర పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. దీని ద్వారా 50,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చంద్రబాబు, లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు, ఉద్యోగ సృష్టికి, పరిశ్రమల వృద్ధికి కేంద్రంగా ముందుకు వెళ్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandrababu Naidu
  • industrial development
  • IT sector
  • Nara Lokesh

తాజావార్తలు

  • Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!

  • SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్‌.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!

  • Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..

ట్రెండింగ్‌

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions