Andhra Pradesh: రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన సెల్ ఫోన్.. కత్తులు, కర్రలతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.. ఇక యూత్ అయితే ఫోన్లో గేమ్స్ తో పాటు సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుతుంటారు.. అయితే నాలాడ్జ్ పెంచుకోవడం మాత్రమే కాదు సెల్ ఫోన్ వల్ల రెండు గ్రామాల్లో గొడవలు కూడా జరిగాయి.. గేమింగ్కు సంబంధించి కొంతమంది యువకుల మధ్య మొదలైన వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ గ్రామం వారు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా మరో గ్రామంపై దాడికి దిగడం కలకలం రేపుతోంది..
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. రాష్ట్రంలోని కర్నూలు నంద్యాల జిల్లాలో ని మహానంది మండలం లో సెల్ఫోన్ గేమింగ్ సంబంధించి బసవాపురం, గాజులపల్లె గ్రామాల యువకుల మధ్య వివాదం జరిగింది. మాటమాట పెరగడంతో తీవ్ర దూషణలకు దారితీసింది. బసవాపురాని కి చెందిన యువకుడు ఇంటికి వెళ్లాక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పాడు. దీంతో బుధవారం రాత్రి దాదాపు 50 మంది బసవపురం వాసులు గాజులపల్లె గ్రామంలోకి వచ్చారు. కర్రలు, కత్తులు చేత పట్టుకని ఆ గ్రామంలోని కొందరు యువకులు, వారి కుటుంబ సభ్యులను గాలిస్తూ దాడులు చేశారు..
Also Read
ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు.. ఈ క్రమం లో తాజ్, జహరాబీ దంపతులను తీవ్రంగా కొట్టడంతో వారింటి తలుపులు పగల గొట్టినట్లు స్థానికులు తెలిపారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు పేర్కొన్నారు. దాడులు జరుగుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఫోర్స్ తో సహా వెంటనే గ్రామానికి చేరుకున్నారు.. దాడులు చేసుకుంటున్న గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించారు.. ఇద్దరి యువకుల కోసం అది కూడా గేమ్ కోసం రెండు గ్రామాలు కొట్టుకోవడం సినిమాను తలపించిందనే చెప్పాలి.. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన పై చర్చించుకుంటున్నారు.. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!