Andhra Pradesh: రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన సెల్ ఫోన్.. కత్తులు, కర్రలతో దాడి..
ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.. ఇక యూత్ అయితే ఫోన్లో గేమ్స్ తో పాటు సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుతుంటారు.. అయితే నాలాడ్జ్ పెంచుకోవడం మాత్రమే కాదు సెల్ ఫోన్ వల్ల రెండు గ్రామాల్లో గొడవలు కూడా జరిగాయి.. గేమింగ్కు సంబంధించి కొంతమంది యువకుల మధ్య మొదలైన వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ గ్రామం వారు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా మరో గ్రామంపై దాడికి దిగడం కలకలం రేపుతోంది..
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. రాష్ట్రంలోని కర్నూలు నంద్యాల జిల్లాలో ని మహానంది మండలం లో సెల్ఫోన్ గేమింగ్ సంబంధించి బసవాపురం, గాజులపల్లె గ్రామాల యువకుల మధ్య వివాదం జరిగింది. మాటమాట పెరగడంతో తీవ్ర దూషణలకు దారితీసింది. బసవాపురాని కి చెందిన యువకుడు ఇంటికి వెళ్లాక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పాడు. దీంతో బుధవారం రాత్రి దాదాపు 50 మంది బసవపురం వాసులు గాజులపల్లె గ్రామంలోకి వచ్చారు. కర్రలు, కత్తులు చేత పట్టుకని ఆ గ్రామంలోని కొందరు యువకులు, వారి కుటుంబ సభ్యులను గాలిస్తూ దాడులు చేశారు..
Also Read
ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు.. ఈ క్రమం లో తాజ్, జహరాబీ దంపతులను తీవ్రంగా కొట్టడంతో వారింటి తలుపులు పగల గొట్టినట్లు స్థానికులు తెలిపారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు పేర్కొన్నారు. దాడులు జరుగుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఫోర్స్ తో సహా వెంటనే గ్రామానికి చేరుకున్నారు.. దాడులు చేసుకుంటున్న గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించారు.. ఇద్దరి యువకుల కోసం అది కూడా గేమ్ కోసం రెండు గ్రామాలు కొట్టుకోవడం సినిమాను తలపించిందనే చెప్పాలి.. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన పై చర్చించుకుంటున్నారు.. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!