AP Assembly Session: ఎక్కడ దొరికిపోతామని భయపడుతున్నారు.. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రండి
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. దాదాపు వారం రోజుల పాటు సాగే అవకాశమున్న ఈ సమావేశాల్లో సహజంగానే విపక్ష నేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం కాకపుట్టిస్తోంది. సమావేశాలకు టీడీపీతో పాటు అధికారంలో ఉన్న వైసీపీ కూడా ప్రిపేర్ అయి వచ్చినట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే.. టీడీపీ చంద్రబాబు అరెస్టుపై చర్చ కోరుతూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వాయిదా తీర్మానం ఇచ్చింది. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానానికి స్పీకర్ వెంటనే అనుమతించకపోవడంతో నిరసనకు దిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. సభా కార్యక్రమాలు జరుగాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు అరెస్టుపై చర్చకు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ వారి వారించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ సదరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తు్న్నట్లు ప్రకటించారు.
Read Also:Viral Video: హ్యాట్సాఫ్ బాసూ.. ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యువకుడు!
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఈ క్రమంలో టీడీపీ సభ్యుల అడిగిన ప్రశ్నలకు మీడియా పాయింట్లో పలువురు వైసీపీ నేతలు సమాధానాలు ఇచ్చారు. చంద్రబాబు అవినీతి పై చర్చించేందుకు రమ్మంటే టీడీపీ నేతలు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. చంద్రబాబు తప్పు చేసింది వాస్తవం అవునా ..కాదా ? అంటూ ప్రశ్నించారు. ఎక్కడ దొరికిపోతామోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ కోరలేకపోతున్నారో ఆలోచించాలన్నారు.
Read Also:AP Assembly: ముగిసిన బీఏసీ.. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
స్పీకర్ పట్ల టీడీపీ నేతలు చాలా అమర్యాదగా వ్యవహరించారని ఎమ్మె్ల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నప్పటికీ చర్చ కొనసాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభకు వచ్చారన్నారు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ పైనే మాట్లాడుతున్నారు.. దానిపై చర్చిద్దాం అంటే ఎందుకు పారిపోతున్నారో అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారో తెలియడం లేదన్నారు. సమావేశాల్లోనే కచ్చితంగా చంద్రబాబు అవినీతి పై చర్చింది.. నిజనిజాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!