NTV Telugu Site icon

Ananya Pande : రొమాన్స్ చేయాలని ఉంది : అనన్య పాండే

Ananya Panday Aditya

Ananya Panday Aditya

Ananya Pande : సినీ ఇండస్ట్రీ లాంటి పోటీ ప్రపంచంలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడమంటే అంత సులభం కాదు. అందం ఉంటే సరిపోదు కాసింత అదృష్టం కూడా ఉండాలి. అయినా మేల్ డామినేషన్ ఉండే ఈ ఫీల్డులో హీరోయిన్లు తమ కెరీర్ కొనసాగించాలంటే.. వచ్చిన ఏ ఆఫర్ వచ్చినా కాదనొద్దు. ఈ విషయాన్ని గ్రహించిన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తాను ఎలాంటి రోల్స్ చేయడానికైన సిద్ధమేనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన లైగర్‌ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగు కుర్రకారును అట్రాక్ట్ చేసింది. తొలి మూవీనే డిజాస్టర్ అయినా.. కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో తాను అనుకున్నట్లు ఆఫర్లు రాక తిరిగి బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, ‘డ్రీమ్‌గర్ల్‌ 2’లాంటి చిత్రాలతో అక్కడి ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో, హాట్ వెబ్ సీరిస్ ల్లో నటిస్తూ ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది.

Read Also:Heartbreaking Incident: కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే ఇంటికి వెళదాం..

అనన్య నటించిన సినిమాలు చెప్పుకో తగ్గ విధంగా విజయం సాధించకున్నా.. ఈ అమ్మడికి మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. తాజాగా ‘కంట్రోల్‌’తో ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ మూవీకి విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో విహాన్ సమత్ కీలక పాత్రలో నటించారు. అంతకుముందు కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ లో కూడా అనన్య పాండే, విహాన్ సమత్ కలిసి నటించారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Read Also:Haryana Election Results: హర్యానాలో అధికారం చేపడతాం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: భూపేందర్ సింగ్

అనన్య మాట్లాడుతూ..‘‘కరణ్ జోహర్ దర్శకత్వంలో వచ్చిన ‘కాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’లో కేవలం చిన్నపాత్రలో నటించే అవకాశమే వచ్చింది. కానీ, ఆయన సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో జానర్‌ సినిమాల్లో నటించాను. రొమాంటిక్‌, హారర్‌, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలనుంది. అంటూ తన మససులోని మాటను బయటపెట్టింది. ఇక సోషల్‌ మీడియా గురించి మాట్లాడుతూ.. తాను చిన్నప్పుడు ఓ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశాననీ, ఆ విషయం తన తల్లికి తెలిసి దాన్ని డీఆక్టివేట్ చేసిందనీ, 18 ఏళ్లు నిండిన తర్వాత మళ్లీ సోషల్‌ మీడియాలో అడుగుపెట్టానని, బ్రేక్ దొరికితే ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఉంటాననీ, తనకు నచ్చిన సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటానని చెప్పారు అనన్య పాండే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ టైంలో అనన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.