Heartbreaking Incident: కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే ఇంటికి వెళదాం..
- అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడులో రోడ్డు ప్రమాదం..
- కొడుకు మృతి చెందడంతో ఆసుపత్రి బెడ్ పై తల్లి కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heartbreaking Incident: రోడ్డు ప్రమాదం ఓ కుటంబాన్ని చిదిమేసింది. కొద్ది సేపట్లో అందరూ ఇంటికి చేరుకుంటాం అనుకునేలోపే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కొడుకు లేడనే విషయం తెలిసినా తల్లికి ఆశ చావదు.. తన కొడుకు బతికి ఉన్నాడని హడావిడి చేస్తూ ఆసుపత్రికి తీసుకుని వెళ్లింది. అక్కడి వైద్యులు చిన్నారిని చూసి మృతి చెందినట్లు తెలిపారు. అప్పటి వరకు తన ఓడిలో కూర్చున కొడుకు తిరిగి రాడని తెలిసి కూడా.. బెడ్ పై వున్న కన్న కొడుకు చేయి పట్టుకుని లే కన్నా ఇంకా ఎంత సేపు పడుకుంటావు అంటూ చెప్పిన మాటలు అక్కడున్న వారందరికి కంటతడి పెట్టించాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
Read also: Kitchen Sponge: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో గిన్నెలు కడుగుతున్నారా? అయితే..
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
చిన్నారిని కబళించిన మృత్యువు..
అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడుకు చెందిన బాబూరామ్, శిరీష దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల చిన్న కొడుకు అనారోగ్యం క్షీణించింది. దీంతో తల్లిదండ్రలు పిల్లలిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించి మందులు తీసుకుని ఇంటికి బయలు దేరారు. బైక్ పై నలుగురు వెలుతుండగా ఇంతలోనే బైక్ అదుపు తప్పింది. దీంతో నలుగురు ఒక్కసారిగా కిందకు పడిపోయారు. బైక్ పై ముందు కూర్చున్న పెద్ద కొడుకు శ్యామ్ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా.. శ్యామ్ రోడ్డుపై ఉలుకుపలుకు లేకుండా పడిపోయాడు. దీంతో తల్లి వెంటనే శ్యామ్ వద్దకు వెళ్లి చూడగా తలలో నుంచి రక్తం కారుతుంది. దీంతో హుటాహుటిన శ్యామ్ ను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు. అయితే శ్యామ్ ను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని ఆసుపత్రిలో బెడ్పై ఉంచగా తల్లి శిరీష ఆ పక్కనే పడుకుని కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే అని పిలుస్తూ ఉండిపోయింది. అయితే.. బాలుడి తండ్రి ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని చెప్పడంతో తండ్రి కూడా బోరున విలపిస్తూ ఉండిపోయారు. వీరిని చూసిన వారందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
DB Stock Broking Scam: హైదరాబాద్లో రూ. 7,000 కోట్ల విలువైన స్టాక్బ్రోకింగ్ కుంభకోణం..
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!