Anam Venkata Ramana Reddy : అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడు
- గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారు
- సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారు
- అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారు
- జగన్.. ఆదానీల రహస్య చర్చ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది : ఆనం వెంకటరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anam Venkata Ramana Reddy : అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు. జగన్ …ఆదానీల రహస్య చర్చ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి చేయలేదని జగన్ అంటున్నాడని, తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలుని అమెరికా కు పంపు అని ఆయన అన్నారు. రూ.1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నావని ఎఫ్. బి.ఐ. చెబుతోందని, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అవినీతి కుంపటని టీడీపీ ఎప్పుడో చెప్పిందని, సోలార్ విద్యుత్ ను యూనిటకు 11 రూపాయలకు కొన్నారు… టెక్నాలజీ మారే కొద్దీ ధరలు తగ్గుతూ వచ్చాయని, 9 వేల మెగావాట్లకి 1750 కోట్లు సరే… ఇంకా అనేక సోలార్ సంస్థలకు పీపీఏ లు చేశారు… వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నారో బయటకి తీయాలని ఆయన అన్నారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ. 20 వేల కోట్ల రూపాయల లంచం జగన్ కు ముట్టిందని ఆనం ఆరోపించారు.
Also Read
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
అంతేకాకుండా..’టీటీడీకి అన్యాయం చేసాడు… అందుకే ఆ స్వామి అమెరికా లో కేసు పెట్టించాడు… ఇక్కడ చట్టాలు మాదిరిగా అక్కడ ఉండదు… 6 నెలల్లో తీర్పు వస్తుంది… అపారమైన జ్ఞానం కలిగిన రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చింది… ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలి…. త్వరగా జగన్ ను లాక్కెళ్లాలి.. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి శునకానందం పొందాడు…. అందుకే దేవుడు సరైన శిక్ష వేయబోతున్నాడు… ఈ అభియోగాలు తేలేవరకు జగన్ వైసీపీ అధ్యక్షుడుగా దిగిపోవాలి… జగన్ కేసులకి 11 ఏళ్ళు అయ్యింది… సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చొరవ తీసుకుని కేసుల వ్యవహారంలో వేగం పెంచాలి…’ అని ఆనం వెంకట రమణ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!