Kulgam Encounter: కుల్గామ్లో ఎన్కౌంటర్.. 24 గంటల్లో రెండో ఎన్కౌంటర్
- దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో.
- భారత దేశ భద్రతా బలగాలు - ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్.
- ఎంటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kulgam Encounter: దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత దేశ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని ఎల్ఓసీకి ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లాలో సైనికులు నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఎన్కౌంటర్ ప్రారంభంలో కొన్ని కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఎన్కౌంటర్ స్థలం చుట్టూ భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి. అనుమానిత ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి, ఈ ఎన్కౌంటర్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ మొదలయింది.
Read Also: Death: మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? నర్స్ చెప్పిన విషయాలు వైరల్..
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
అలాగే, కుప్వారాలోని నాగ్మార్గ్లో ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ప్రాంతం బందిపోరా జిల్లాకు ఆనుకొని ఉంది. ఇది కాకుండా ఈ ప్రాంతం LOC సరిహద్దులో ఉంది. కాశ్మీర్ లోకి చొరబడే ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని బండిపోరా, సోపోర్, గందర్బాల్, శ్రీనగర్ మీదుగా దక్షిణ కాశ్మీర్కు చేరుకుంటారు. మరోవైపు, నాగ్మార్గ్లో ఉగ్రవాదులు కనిపించారనే సమాచారంతో భద్రతా బలగాలు తెల్లవారుజామున ఆపరేషన్ ప్రారంభించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాస్త ఎత్తులో దట్టమైన చెట్ల కింద ఉగ్రవాదులు దాక్కున్నారు. వారిని చుట్టుముట్టేందుకు ఒక భద్రతా బలగాలు కుప్వారా నుంచి, మరో స్క్వాడ్ బండిపోరా జిల్లాలోని రుబందీపూర్ ప్రాంతం నుంచి బయలుదేరాయి. సీజ్లో ఉన్న వారిని చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో సైనికులు కూడా తమను తాము రక్షించుకోవడానికి ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు గంటపాటు ఇరువైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరిగాయి. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది హతమయ్యారో ఇంకా సమాచారం లేదు.
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!