Amit Shah : అమిత్ షా పర్యటన షెడ్యూల్ మినిట్ టు మినిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Tour Schedule minute to minute
మునుగోడు నియోజకవర్గం చుట్టూ రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతనిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకుల తమ జెండాను మునుగోడులో ఎగురవేయాలని చూస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇప్పటికే మనుగోడలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే.. నిన్న సీఎం కేసీఆర్ ప్రజాదీవెన అంటూ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే నేడు.. బీజేపీ మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అయితే.. ఈ భారీ బహిరంగ సభకు జాతీయ నాయకులు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అంతేకాకుండా.. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో.. అమిత్ షా షెడ్యూల్ ను తెలంగాణ బీజేపీ నేతలు విడుదల చేశారు.
Also Read
- CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
- Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
- Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
- Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
Bandi Sanjay : టీఆర్ఎస్ పతనం.. కేసీఆర్ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది
రెండు గంటలకు హైదరాబాద్ అమిత్ షా చేరుకోనున్నారు. 2.10 నుంచి 2.30 వరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం. 2.40 నుంచి 3.10 వరకు సికింద్రాబాద్ లోని బీజేపీ కార్యకర్త ఎన్.సత్యనారాయణ ఇంటికి అమిత్ షా చేరుకుంటారు. 3.20 నుంచి 4 గంటల వరకు ప్రైవేట్ హోటల్ లో రైతులు,రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. 4.10 బేగంపేట ఎయిర్ పోర్ట్కు. 4.30 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. 4.35 నుంచి 4.55 వరకు మునుగోడులో సీఆర్పీఎఫ్ అధికారులతో సమావేశం. 5 గంటల నుండి 6 గంటల వరకు మునుగోడు బీజేపీ బహిరంగ సభ. 6.05 నిమిషాలకు మునుగోడు నుంచి రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం. 6.50 నుంచి 7.20 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక భేటీ. అనంతరం.. రాత్రి 8 గంటల కు నోవాటేల్ హోటల్కు అమిత్ షా చేరుకుంటారు. 8 నుంచి 9 గంటల వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం. 9.05కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్.. 9.25 కి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు అమిత్ షా.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
-
Tirumala: తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం ఎలా మొదలైంది.. దాని వెనుక ఉన్న పురాణం ఏంటి?
-
Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
-
PM Modi: భారత్కు రూ.3,311 కోట్ల భారీ పెట్టుబడులు.. ఆస్ట్రేలియన్ సూపర్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోడీ
-
Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!