Terrorist Encounter: అమిత్ షా టార్గెట్గా ఉగ్రచొరబాట్లు.. గట్టిగా బదులిచ్చిన ఇండియన్ ఆర్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Encounter: జమ్మూ కాశ్మీర్లో వాతావరణ విధ్వంసం కారణంగా ప్రతిచోటా జనజీవనం అస్తవ్యస్తమైంది. అకాల వర్షాలతో, అనుకూలంగా లేని వాతావరణాన్ని ఉగ్రవాదులు ఆసరాగా చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారి ప్రతి ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టర్ పరిధిలోని LOC లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అధికారులు భగ్నం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్గా చేసుకొని సోమవారం ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తుండగా భారత ఆర్మీ భగ్నం చేసిందని ఉన్నతాధికారులు తెలిపారు.
READ ALSO: Supreme Court : స్థానికత అంశంపై హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు
Also Read
అప్రమత్తంగా భారత సైన్యం…
ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ X లో ఒక పోస్ట్ చేసింది. “సైనికులు అన్ని ప్రాంతాలలో హై అలర్ట్లో ఉన్నారు” అని తెలిపింది. ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ యూనిట్ మొదటి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, రెండు వైపులా మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయని ఒక అధికారి తెలిపారు. రెండు వైపుల నుంచి కాల్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. భారత ఆర్మీ ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణను కలిగి ఉందని, అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన పలువురు ఉగ్రవాదులను మట్టుపెట్టడంతో పాటు, ఇంకా ఎంత మంది మిగిలి ఉన్నారో తెలుసుకోడానికి సర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
అమిత్ షా పర్యటన సందర్భంగా..
గత నెలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ పర్యటనకు వచ్చారు. ఈక్రమంలో ఈ ఉగ్రచొరబాటు ప్రయత్నం జరిగింది. సోమవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో బాలకోట్ సాధారణ ప్రాంతంలోని వైట్ నైట్ కార్ప్స్ దళాలు నియంత్రణ రేఖ సమీపంలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించాయి. వెంటనే అప్రమత్తమైన దళాలు చొరబాటుకు యత్నిస్తున్న ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని ఆర్మీ అధికారి తెలిపారు. తెల్లవారుజామున బాలకోట్లోని డబ్బి గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు కనిపించాయని, ఆ తర్వాత మొదటి ఎన్కౌంటర్ జరిగిందని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు కాల్పుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని, అయితే అదనపు దళాలను రప్పించి, మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి, క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించామని పేర్కొన్నారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు, చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!