Amit Shah: పాకిస్థాన్ మాట రాహుల్గాంధీ నోట వినబడుతోంది.. అమిత్ షా ఆగ్రహం..
- ఆపరేషన్ సిందూర్పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారు
- పాకిస్థాన్ మాట రాహుల్గాంధీ నోట వినబడుతోంది
- ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పాం
- నిజామాబాద్ రైతు సమ్మేళన సభలో అమిత్షా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్గాంధీపై అమిత్షా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్ మాట రాహుల్గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు.. ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లపై అంశంపై అమిత్షా మరోసారి
స్పందించారు.
READ MORE: Amit Shah: కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఏటీఎంగా మారింది..
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వారికి సూచించారు. పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్థాన్ మనల్ని భయపెట్టాలని చూసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత భారత్ శక్తి ఏమిటో పాకిస్థాన్కు, ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా..? మీరే చెప్పండి అని జనాలను కేంద్ర మంత్రి అడిగారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని సూచించారు. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలని. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని గుర్తు చేశారు.. జన జీవన స్రవంతిలోకి వచ్చేశారన్నారు.
READ MORE: Peddi Reddy: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
“తెలంగాణలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుంది. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బీజేపీ విజయం ఖాయమైందని తెలుస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్ నిజామాబాద్కు పసుపుబోర్డు సాధించారు. పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తున్నాం. మోడీ ఏదైనా చెప్పారంటే అది తప్పకుండా చేసి చూపిస్తారు. నిజామాబాద్ రైతులు పసుపుబోర్డు కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. నిజామాబాద్ రైతులు పండించిన పసుపు భవిష్యత్లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుంది.” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..