Amit Shah : హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ రాచరిక రాష్ట్రం సెప్టెంబర్ 17, 1948న ఇండియన్ యూనియన్లో విలీనమైన రోజు ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ వేడుకల్లో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే.. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్, ఇతర నేతలు స్వాగతం పలికారు. అనంతరం జూబ్లీహిల్స్లోని సీఆర్ఫీఎఫ్ కార్యాలయంలో.. రాష్ట్రానికి చెందిన పార్టీ అగ్రనేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశంపై అమిత్ షా ఆరా తీశారు. అంతేకాకుండా.. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో కూడా అమిత్ షా భేటీ అయ్యారు.
Also Read : Godavari Anjireddy: చనిపోయిన నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆపన్నహస్తం
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ‘విమోచన దినోత్సవం’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత ఏడాది కూడా తొలిసారిగా కేంద్రం అధికారికంగా నిర్వహించిన ఈ దినోత్సవ వేడుకలకు షా హాజరయ్యారు. ఈ దఫా కూడ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది. రాష్ట్రంలో మూడు చోట్ల నుండి బస్సు యాత్రలు ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Also Read : Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!