Amit Shah: సీఏఏపై మమతకు వచ్చిన ఇబ్బందేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సెకండ్ విడత పోలింగ్కు సమయం దగ్గర పడింది. సెకండ్ ఫేజ్లో జరిగే స్థానాల్లో బుధవారం ప్రచారం ముగియనుంది. దీంతో నేతలు స్పీడ్ పెంచారు. విమర్శల దాడి కూడా హీటెక్కిస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: PM Modi: ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు.. మోడీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి 17,000 మంది లేఖ..
Also Read
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
- Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్రౌండర్లు ఒకేసారి అవుట్..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
కాంగ్రెస్కు కానీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్లో పౌరసత్వం ఇస్తే.. మీకు వచ్చిన సమస్య ఏంటని నిలదీశారు. తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే.. సందేశ్ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. మోడీ మళ్లీ ప్రధానిగా కావాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Lok sabha election: 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ ఎఫెక్ట్.. 26న పోలింగ్ తగ్గనుందా?
గత ఎన్నికల్లో 18 సీట్లు ఇచ్చారని.. ప్రతిగా మోడీ రామమందిరం తీసుకువచ్చారని అమిత్ షా గుర్తుచేశారు. ఈసారి 35 సీట్లు ఇస్తే.. చొరబాట్లను ఆపేస్తారన్నారు. తన ఓటు బ్యాంక్పై దృష్టిపెట్టిన మమతాబెనర్జీ.. సందేశ్ఖాలీలో మహిళల్ని వేధించినా పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హైకోర్టు జోక్యంతో ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడన్నారు. ఈసారి తమ లక్ష్యం 35 లోక్సభ స్థానాలు సాధించడమని వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పదేళ్ల క్రితం వరకు టీఎంసీ నేతలు చిన్నపాటి ఇళ్లల్లో ఉండేవారని.. సైకిల్ మీద తిరిగేవారన్నారు. కానీ ఇప్పుడు నాలుగు అంతస్తుల భవనాల్లో నివసిస్తూ.. కార్లలో చక్కర్లు కొడుతున్నారని తెలిపారు. అందంతా ప్రజల సొమ్మేనంటూ అమిత్ షా విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: Rahul gandhi: అమేథీలో రాహుల్ ఇల్లు క్లీనింగ్.. ఏం జరుగుతోంది!
తాజావార్తలు
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్రౌండర్లు ఒకేసారి అవుట్..
-
Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
-
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్కు రెడీగా ఉండండి!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!