Chhattisgarh Election: నేడు ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా, రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. కాగా, ఇవాళ కాంగ్రెస్- బీజేపీ పార్టీలకు చెందిన అగ్ర నాయకత్వం అక్కడ ప్రచారం చేస్తుంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లో పర్యటిస్తున్నారు. అయితే, నవంబర్ 17న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఆ తర్వాత ప్రచారం చేసేందుకు అవకాశం ఉండకపోవడంతో చివరి రోజు రెండు పార్టీల అగ్రనాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు.
Read Also: Prabhas: ఆ కటౌట్ కి ఆ మాత్రం ఖర్చు పెట్టొచ్చు…
Also Read
ఇక, నవంబర్ 17న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ప్రచార సందడి ఆగిపోతుంది. కాగా, అమిత్ షా మధ్యాహ్నం 12:00 గంటలకు ఛత్తీస్గఢ్లోని సజా నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. దీని తర్వాత, మధ్యాహ్నం 01:55 గంటలకు జంజ్గిర్-చంపా నియోజక వర్గం.. ఆ తర్వాత మధ్యాహ్నం 03:20 గంటలకు కోర్బాలో బీజేపీ నిర్వహించే ఎన్నికల సభలో ప్రసంగించనున్నారు. ఇక, సాయంత్రం బిలాస్పూర్లోని గాంధీచౌక్ నుంచి అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈరోజు రెండు ఎన్నికల సభల్లో పాల్గొంటారు. మొదటి ఈవెంట్ హైస్కూల్ గ్రౌండ్ ఆరాంగ్లో మధ్యాహ్నం 01:25 గంటలకు జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 03:10 గంటలకు అంబికాపూర్లోని కళాకేంద్ర గ్రౌండ్లో జరుగనుంది. దీనికి ముందు ఛత్తీస్గఢ్లోని బీజేపీ అభ్యర్థుల కోసం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సైతం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
Read Also: Stock Market Opening: రాకెట్ వేగంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
మరో వైపు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాయ్గఢ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాష్ నాయక్, చరదాస్ మహంత కోసం వేర్వేరు సమావేశాల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు బెమెతరలోని బీటీఐ గ్రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ ఛబ్రా, టీఎస్ సింగ్దేవ్, డాక్టర్ ప్రీతమ్ రామ్, దీపక్ బైజ్ లకు మద్దతుగా జరిగే ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రచారం చేస్తున్నారు.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!