Amit Sha: 12 సీట్లు గెలిస్తే రాష్ట్రంలో తర్వాత బీజేపీ ప్రభుత్వమే.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలు పార్లమెంట్ కన్వీనర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ.. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. లోకసభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలు సమావేశాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టి, సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా సూచించారు.
Damodar Rajanarsimha: వైద్యారోగ్య శాఖ సాహసోపేతమైన నిర్ణయం.. 4356 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
ఈ సందర్భంగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 12 సీట్లు గెలిస్తే రాష్ట్రంలో తర్వాత బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. సర్వేల ప్రకారం తెలంగాణలో 12 సీట్లు గెలువబోతున్నాము.. ఇంకా కష్టపడితే 15 గెలుస్తామని తెలిపారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేయండి.. బూత్ కమిటీలు ఉన్నాయా లేవో చెక్ చేసుకోండని సూచించారు. ప్రతి పార్లమెంట్ కి 50 మందితో ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయండని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఫోన్ లు చేయించండి.. తాను తన పార్లమెంట్ పరిధిలో 3 లక్షల మందితో కాన్ఫరెన్స్ లో మాట్లాడాను.. మీరు కూడా అలా చేయండని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ప్రతి రోజూ బైక్ లకి బీజేపీ జండాలు కట్టి తిరగండి…అనుకూల వాతావరణం వస్తుందని అమిత్ షా తెలిపారు.
Meera Chopra: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్.. ఫొటోలు చూశారా?
అంతేకాకుండా.. రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. అవినీతి రహిత భారత్ నిర్మాణమే బీజేపీ లక్ష్యం అని తెలిపారు. అంతకుముందు.. ఆయన ఎల్బీ స్టేడియంలో జరిగిన విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం చార్మినార్ లో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!