Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Amit Shah Gifts Guitar To Esther Lalduhawmi Hnamte Vande Mataram Performance

Minister Amit Shah: చిన్నారి పాటకు మంత్రముగ్ధుడైన కేంద్ర హోంమంత్రి.. బహుమానంగా ఏమిచ్చారంటే?

Published Date :March 16, 2025 , 9:59 am
By Kothuru Ram Kumar
  • మిజోరంను సందర్శించిన హోంమంత్రి అమిత్ షా.
  • చిన్నారి పాటకు మంత్రముగ్ధుడైన కేంద్ర హోంమంత్రి.
  • బహుమానంగా గిటార్ ను బహుకరించారు.
Minister Amit Shah: చిన్నారి పాటకు మంత్రముగ్ధుడైన కేంద్ర హోంమంత్రి.. బహుమానంగా ఏమిచ్చారంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఈశాన్య భారత పర్యటన సందర్భంగా శనివారం (మార్చి 15) మిజోరాం‌లో ఓ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించారు. మిజోరాం‌కు చెందిన ఏడేళ్ల గాయనీ ఎస్తేర్ లాలదుహావమీ హనామ్తే పాటకు కేంద్రమంత్రి అమిత్ షా మంత్రముగ్ధుడయ్యాడు. దింతో ఆ చిన్నారికి గిటార్ ను బహుకరించారు. ఈ సందర్భంగా, అమిత్ షా తన అధికారిక X (Twitter) ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ.. భారతదేశం పట్ల ప్రేమ మనందరినీ కలిపే బంధంగా మారుతుంది. మిజోరాం వండర్ కిడ్ ఎస్తేర్ లాలదుహామీ హనామ్తే వందేమాతరం పాటను ఆలపించడం నన్ను చాలా భావోద్వేగానికి గురి చేసిందని పేర్కొన్నారు. ఏడేళ్ల వయసు ఉన్న చిన్నారి ఎస్తేర్ దేశభక్తితో నిండిన పాటను ఆలపించడం నిజంగా ఓ అద్భుత అనుభూతని అన్నారు. ఆమె గానం చేసిన ‘మా తుఝే సలామ్’ పాట ఐదవరకు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశభక్తిని వ్యక్తపరిచే ఆమె గానం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఈ ప్రతిభకు గుర్తింపుగా మిజోరాం ప్రభుత్వం చిన్నారిని అనేక అవార్డులతో సత్కరించింది.

Read Also: Harassment: మైనర్ బాలికపై వేధింపులు.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం

Also Read

  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
  • BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
  • Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
  • Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్‌లైన్స్ హెచ్చరిక..

ఇకపోతే, హోంమంత్రి అమిత్ షా మార్చి 14 (శుక్రవారం) నుండి మూడు రోజుల పాటు అస్సాంలో పర్యటించనున్నారు. అయితే మార్చి 15న, ఆయన మిజోరంను సందర్శించారు, అక్కడ అస్సాం రైఫిల్స్ భూమిని మిజోరం ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ఏర్పాటు చేసిన భూ బదిలీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా, అస్సాం రైఫిల్స్ సేవలను కొనియాడుతూ.. దేశ భద్రతను మార్గదర్శకంగా తీసుకుని, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంలో అస్సాం రైఫిల్స్ విశేషమైన సేవలు అందిస్తోందని అన్నారు. భద్రతా దళాలు తమ భూమిలో భాగాన్ని మిజోరాం ప్రభుత్వానికి అందజేయడం ప్రజల పట్ల వారి నిబద్ధతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

Love for Bharat unites us all.

Deeply moved to listen to Mizoram's wonder kid Esther Lalduhawmi Hnamte, singing Vande Mataram in Aizawl today. The seven-year-old's love for Bharat Mata poured out into her song, making listening to her a mesmerizing experience.

Gifted her a… pic.twitter.com/7CLOKjkQ9y

— Amit Shah (@AmitShah) March 15, 2025

మిజోరాం రాజధాని ఐజాల్‌లో అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయాన్ని మధ్య ఐజాల్ నుండి జోఖావ్సాంగ్‌కు తరలించడానికి తీసుకున్న నిర్ణయం మిజో ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటని అమిత్ షా అన్నారు. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాకుండా, మిజోరాం ప్రజల పట్ల భారత ప్రభుత్వం నిబద్ధతకు ప్రతీకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఈశాన్య భారత దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. పర్యాటకం, సాంకేతికత, వ్యవసాయం, వ్యాపారం వంటి రంగాల్లో అనేక మార్పులను తీసుకురావడంతో ఈ ప్రాంత అభివృద్ధి సమగ్రంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Assam Rifles
  • Esther Lalduhawmi Hnamte
  • Mizoram
  • Social Media Viral

తాజావార్తలు

  • Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..

  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..

  • BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..

  • Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్

  • Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions