Shocking Incident : అమీన్పూర్లో తల్లి ఘాతుకం.. మూడు ప్రాణాలను బలిగొన్న వివాహేతర సంబంధం
- అమీన్పూర్లో దారుణ ఘటన
- తల్లి చేతిలో ముగ్గురు పిల్లల మృతి
- విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident : సమాజంలో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విశ్వాసం, ప్రేమ, బాధ్యతలు అనే భావనలు కొందరికి వ్యర్థమైపోతున్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక ప్రయోజనాలకూ, స్వార్థ ఆకాంక్షలకూ బలవుతున్నాయి. ఇటువంటి ఓ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా ఆమిన్పూర్లో చోటుచేసుకుంది. రజిత (45) అనే మహిళ తన ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. భర్తను, పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె చేసిన కుట్ర భయానక నిజాలను బయట పెట్టింది.
ఇటీవల, 10వ తరగతి విద్యార్థుల గెట్-టు-గెదర్ పార్టీలో రజితకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. కుటుంబానికి దూరమై, తన ప్రియుడితో జీవించాలని రజిత నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త చెన్నయ్య, పిల్లలను చంపేయాలనే దారుణ నిర్ణయానికి వచ్చింది. గత నెల 27న రాత్రి, భోజన సమయంలో రజిత పెరుగులో విషపదార్థం కలిపింది. అయితే, భర్త చెన్నయ్య ఆ రోజు పెరుగు తినకుండా డ్యూటీకెళ్లిపోయాడు. పిల్లల్ని మాత్రం బలవంతంగా పెరుగన్నం తినిపించింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఉదయానికల్లా పిల్లలు ముగ్గురు కూడా విగతజీవులై పడిపోయారు – సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8). భార్య రజిత కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో చెన్నయ్య ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. మొదట పోలీసులు చెన్నయ్య మీదే అనుమానం పెట్టుకున్నారు. కానీ, విచారణలో రజిత అసలు బాగోతం బయటపడింది.
పిల్లలు అనారోగ్యంతో మరణించలేదని, అవి హత్యలేనని పోలీసులు గ్రహించారు. రజిత గత కొన్ని నెలలుగా ప్రియుడితో కలిసి ఉండాలని అనుకున్నట్లు తెలిసింది. కుటుంబ బంధాలను పక్కనపెట్టి, వివాహేతర సంబంధానికి బానిసై, ఓ తల్లి తన ముగ్గురు పిల్లలను ఎలా హత్య చేయగలిగింది? ఈ ఘటన మనిషి మనసులోని స్వార్థపూరిత భావాలను ప్రశ్నించేలా చేస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు నేడు ప్రెస్మీట్ ఏర్పాటు చేసి, పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఈ ఘటన మన సమాజంలో కుటుంబ బంధాలు ఎలా మారిపోతున్నాయనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. గతంలో కుటుంబాలు ఒకరికొకరు ఆధారంగా జీవించేవి. కానీ, ఇప్పుడు వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత అవసరాలు పెరిగిపోతున్నాయి. పాతతరం విలువల నుంచి కొత్త తరం మరింత స్వేచ్ఛా జీవనాన్ని కోరుకుంటోంది.
అయితే, అది ఎంత వరకు న్యాయమైనది? సమాజంలో బంధాలు మరిచిపోతూ, మానవ సంబంధాలు కేవలం లావాదేవీలుగా మారిపోతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం చూస్తున్న సంఘటనల్లోనే దాగి ఉంది. బంధాలు నశించకుండా, మానవత్వం కోల్పోకుండా, నైతికత విలువలను నిలుపుకోవాలంటే కుటుంబ సభ్యుల మధ్య విశ్వాసం, పరస్పర గౌరవం, ప్రేమ పెంపొందించుకోవడం తప్పనిసరి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!