Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Aminpur Mother Poisons Three Children Affair Murder

Shocking Incident : అమీన్‌పూర్‌లో తల్లి ఘాతుకం.. మూడు ప్రాణాలను బలిగొన్న వివాహేతర సంబంధం

Published Date :April 2, 2025 , 10:15 am
By Gogikar Sai Krishna
  • అమీన్‌పూర్‌లో దారుణ ఘటన
  • తల్లి చేతిలో ముగ్గురు పిల్లల మృతి
  • విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు
Shocking Incident : అమీన్‌పూర్‌లో తల్లి ఘాతుకం.. మూడు ప్రాణాలను బలిగొన్న వివాహేతర సంబంధం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shocking Incident : సమాజంలో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విశ్వాసం, ప్రేమ, బాధ్యతలు అనే భావనలు కొందరికి వ్యర్థమైపోతున్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక ప్రయోజనాలకూ, స్వార్థ ఆకాంక్షలకూ బలవుతున్నాయి. ఇటువంటి ఓ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా ఆమిన్‌పూర్‌లో చోటుచేసుకుంది. రజిత (45) అనే మహిళ తన ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. భర్తను, పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె చేసిన కుట్ర భయానక నిజాలను బయట పెట్టింది.

ఇటీవల, 10వ తరగతి విద్యార్థుల గెట్-టు-గెదర్ పార్టీలో రజితకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. కుటుంబానికి దూరమై, తన ప్రియుడితో జీవించాలని రజిత నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త చెన్నయ్య, పిల్లలను చంపేయాలనే దారుణ నిర్ణయానికి వచ్చింది. గత నెల 27న రాత్రి, భోజన సమయంలో రజిత పెరుగులో విషపదార్థం కలిపింది. అయితే, భర్త చెన్నయ్య ఆ రోజు పెరుగు తినకుండా డ్యూటీకెళ్లిపోయాడు. పిల్లల్ని మాత్రం బలవంతంగా పెరుగన్నం తినిపించింది.

Also Read

  • CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
  • Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
  • Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
  • M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

ఉదయానికల్లా పిల్లలు ముగ్గురు కూడా విగతజీవులై పడిపోయారు – సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8). భార్య రజిత కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో చెన్నయ్య ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. మొదట పోలీసులు చెన్నయ్య మీదే అనుమానం పెట్టుకున్నారు. కానీ, విచారణలో రజిత అసలు బాగోతం బయటపడింది.

పిల్లలు అనారోగ్యంతో మరణించలేదని, అవి హత్యలేనని పోలీసులు గ్రహించారు. రజిత గత కొన్ని నెలలుగా ప్రియుడితో కలిసి ఉండాలని అనుకున్నట్లు తెలిసింది. కుటుంబ బంధాలను పక్కనపెట్టి, వివాహేతర సంబంధానికి బానిసై, ఓ తల్లి తన ముగ్గురు పిల్లలను ఎలా హత్య చేయగలిగింది? ఈ ఘటన మనిషి మనసులోని స్వార్థపూరిత భావాలను ప్రశ్నించేలా చేస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు నేడు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

ఈ ఘటన మన సమాజంలో కుటుంబ బంధాలు ఎలా మారిపోతున్నాయనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. గతంలో కుటుంబాలు ఒకరికొకరు ఆధారంగా జీవించేవి. కానీ, ఇప్పుడు వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత అవసరాలు పెరిగిపోతున్నాయి. పాతతరం విలువల నుంచి కొత్త తరం మరింత స్వేచ్ఛా జీవనాన్ని కోరుకుంటోంది.

అయితే, అది ఎంత వరకు న్యాయమైనది? సమాజంలో బంధాలు మరిచిపోతూ, మానవ సంబంధాలు కేవలం లావాదేవీలుగా మారిపోతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం చూస్తున్న సంఘటనల్లోనే దాగి ఉంది. బంధాలు నశించకుండా, మానవత్వం కోల్పోకుండా, నైతికత విలువలను నిలుపుకోవాలంటే కుటుంబ సభ్యుల మధ్య విశ్వాసం, పరస్పర గౌరవం, ప్రేమ పెంపొందించుకోవడం తప్పనిసరి.

YS Jagan: నేడు వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aminpur Crime
  • extra marital affair
  • Family Tragedy
  • Mother Poisons Children
  • police investigation

తాజావార్తలు

  • Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..

  • CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

  • NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?

  • Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions