Shocking Incident : అమీన్పూర్లో తల్లి ఘాతుకం.. మూడు ప్రాణాలను బలిగొన్న వివాహేతర సంబంధం
- అమీన్పూర్లో దారుణ ఘటన
- తల్లి చేతిలో ముగ్గురు పిల్లల మృతి
- విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident : సమాజంలో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విశ్వాసం, ప్రేమ, బాధ్యతలు అనే భావనలు కొందరికి వ్యర్థమైపోతున్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక ప్రయోజనాలకూ, స్వార్థ ఆకాంక్షలకూ బలవుతున్నాయి. ఇటువంటి ఓ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా ఆమిన్పూర్లో చోటుచేసుకుంది. రజిత (45) అనే మహిళ తన ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. భర్తను, పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె చేసిన కుట్ర భయానక నిజాలను బయట పెట్టింది.
ఇటీవల, 10వ తరగతి విద్యార్థుల గెట్-టు-గెదర్ పార్టీలో రజితకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. కుటుంబానికి దూరమై, తన ప్రియుడితో జీవించాలని రజిత నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త చెన్నయ్య, పిల్లలను చంపేయాలనే దారుణ నిర్ణయానికి వచ్చింది. గత నెల 27న రాత్రి, భోజన సమయంలో రజిత పెరుగులో విషపదార్థం కలిపింది. అయితే, భర్త చెన్నయ్య ఆ రోజు పెరుగు తినకుండా డ్యూటీకెళ్లిపోయాడు. పిల్లల్ని మాత్రం బలవంతంగా పెరుగన్నం తినిపించింది.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఉదయానికల్లా పిల్లలు ముగ్గురు కూడా విగతజీవులై పడిపోయారు – సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8). భార్య రజిత కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో చెన్నయ్య ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. మొదట పోలీసులు చెన్నయ్య మీదే అనుమానం పెట్టుకున్నారు. కానీ, విచారణలో రజిత అసలు బాగోతం బయటపడింది.
పిల్లలు అనారోగ్యంతో మరణించలేదని, అవి హత్యలేనని పోలీసులు గ్రహించారు. రజిత గత కొన్ని నెలలుగా ప్రియుడితో కలిసి ఉండాలని అనుకున్నట్లు తెలిసింది. కుటుంబ బంధాలను పక్కనపెట్టి, వివాహేతర సంబంధానికి బానిసై, ఓ తల్లి తన ముగ్గురు పిల్లలను ఎలా హత్య చేయగలిగింది? ఈ ఘటన మనిషి మనసులోని స్వార్థపూరిత భావాలను ప్రశ్నించేలా చేస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు నేడు ప్రెస్మీట్ ఏర్పాటు చేసి, పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఈ ఘటన మన సమాజంలో కుటుంబ బంధాలు ఎలా మారిపోతున్నాయనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. గతంలో కుటుంబాలు ఒకరికొకరు ఆధారంగా జీవించేవి. కానీ, ఇప్పుడు వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత అవసరాలు పెరిగిపోతున్నాయి. పాతతరం విలువల నుంచి కొత్త తరం మరింత స్వేచ్ఛా జీవనాన్ని కోరుకుంటోంది.
అయితే, అది ఎంత వరకు న్యాయమైనది? సమాజంలో బంధాలు మరిచిపోతూ, మానవ సంబంధాలు కేవలం లావాదేవీలుగా మారిపోతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం చూస్తున్న సంఘటనల్లోనే దాగి ఉంది. బంధాలు నశించకుండా, మానవత్వం కోల్పోకుండా, నైతికత విలువలను నిలుపుకోవాలంటే కుటుంబ సభ్యుల మధ్య విశ్వాసం, పరస్పర గౌరవం, ప్రేమ పెంపొందించుకోవడం తప్పనిసరి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!