CI Sudhakar : సీఐ సుధాకర్కు బెయిల్ మంజూరు..
భూ వివాదం, ఫోర్జరీ కేసులో అంబర్పేట ఇన్స్పెక్టర్ పేరం సుధాకర్ను వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి అరెస్ట్ తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ శ్రీ సుధాకర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. వనస్థలిపురం పోలీసులు ఈ వారం ప్రారంభంలో ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారుజ ఒక ప్రవాస భారతీయుడు తాను భూ మోసానికి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. అతని పిటిషన్ ప్రకారం.. అతను రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామంలో భూమి కొనుగోలు కోసం శ్రీ సుధాకర్కు రూ.54 లక్షలు చెల్లించాడు. మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి సీఐ సుధాకర్ డబ్బులు కొట్టేశారు. పోలీసులు విచారణ జరిపి సుధాకర్ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈమేరకు సీఐ సుధాకర్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయవూర్తి ఇద్దరు షురిటీలతో 15వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు.
Also Read : Kanti Velugu : కంటి వెలుగు నిర్వహణపై సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
వివరాలు ఇలా..
గతంలో సస్పెండైన ఆర్ఐ రాజేష్పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే కేసు నమోదు చేశారు. కందుకూరు లిమిట్స్లోని నేదునూరు గ్రామంలో సర్వేనెంబర్ 54/2 లో ఉన్న పది ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి బి.ఎన్.రెడ్డి ఎస్ కే డి నగర్ కు చెందిన విజయ కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి 54.5 లక్షల రూపాయలు తీసుకొని నెలలు గడుస్తున్నా ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితులు వనస్థలిపురం పి ఎస్ లో ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలతో సస్పెండైన అర్ ఐ తాను ఎమ్మార్వోనంటూ నకిలీ ఐడి కార్డ్ సృష్టించి త్వరలో ప్రమోషన్ ద్వారా ఆర్డీఓ అవుతానని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నాడు. రాజేశ్ తమ నుంచి తీసుకున్న 54.5 లక్షల రూపాయలను సిఐ సుధాకర్కు ఇచ్చినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకు ఇప్పిస్తానన్న ల్యాండ్.. ఆర్ ఐ రాజేష్ సోదరుడు గతంలోనే కొనుగోలు చేశాడని చెప్పి దానిపై ధరణి పోర్టల్ లోగో తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ ల్యాండ్ అమ్ముతారంటూ తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదులో తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!