NTV Telugu Site icon

Ambati Rambabu: ఆ వివరాలు ఢిల్లీలో బయటపెడతాం..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: గడిచిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ నిజం చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారంట అంటూ ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆధారాలు మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాలంట… లేకపోతే కేసులు పెడతారంట …హోం మంత్రికి ఆ పవర్ ఉంటే కేసులు పెట్టుకోవచ్చని అన్నారు. హోం మంత్రి పరిధి దాటి మాట్లాడుతున్నారని.. జగన్మోహన్ రెడ్డికి మైండ్ దొబ్బిందా , అని హోం మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హోం మంత్రిగా బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నంత జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. రఘురామకృష్ణం రాజు కేసు మూడు సంవత్సరాల తర్వాత తెరమీదకు తెచ్చారన్నారు.

Read Also: Hyderabad: తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

జరుగుతున్న దాడులతో రాష్ట్రంలో ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. హోం మంత్రి సరిగా పనిచేయడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ముచ్చుమర్రిలో హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని ఇప్పటివరకు కనుక్కోలేకపోయారన్నారు. 36 రాజకీయ హత్యలు వివరాలు ఢిల్లీలో బయటపెడతామన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రికి అన్ని వివరాలు అందిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకు తీసుకొస్తుంది టీడీపీ నేతలేనని.. జగన్ రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది ,ప్రజలు కాదు …టీడీపీ అని ఆయన అన్నారు. వినుకొండలో జరిగిన హత్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.