Amanchi Krishna Mohan: పవన్ను టార్గెట్ చేసిన ఆమంచి.. టీడీపీ-జనసేన పొత్తుపై నిజాలు బయటపెడతా…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amanchi Krishna Mohan: టీడీపీ-జనసేన పొత్తు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణ మోహన్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్.. టీడీపీకి రాత్రికి రాత్రే మద్దతు తెలపడం కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బంది కలిగించిందన్నారు.. ప్రధాని మోడీ నన్ను అర్థం చేసుకున్నారు అని పవన్ చెప్పడం ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఉన్న నిస్పృహ ను అర్ధం చేసుకోవచ్చు అన్నారు. పొత్తు ధర్మం పాటించకుండా.. పొత్తులు కుదుర్చుకున్నారు.. జనసేనతో ఖచ్చితంగా కాపు సామాజికవర్గం ఉంది.. జనసేనకు పొత్తు ఉపయోగం కాదు.. సామాన్య కాపులు, పవన్ అభిమానులు పొత్తును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
Read Also: Liquor Shops Closed: మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్స్ బంద్..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇక, టీడీపీ బలోపేతం కోసమే జనసేన ఎందుకు? అని ప్రశ్నించారు ఆమంచి.. పవన్ పెట్టిన పార్టీకి జస్టిఫికెషన్ ఉండాలిగా? అని నిలదీశారు. జనసేన – టీడీపీ పొత్తుపై త్వరలో మరిన్ని వివరాలు చెబుతా అన్నారు. పొత్తు వెనుక ఉన్న నిజాలు బయటపెడతానని తెలిపారు. మరోవైపు.. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి భాష బాలేదు అని దుయ్యబట్టారు ఆమంచి.. దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అనే విషయం పురంధేశ్వరి గుర్తుపెట్టుకోవాలన్న ఆయన.. దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారు కాబట్టి టీడీపీని వ్యతిరేకించినట్టే.. చంద్రబాబు అరెస్ట్ బంధుత్వం ప్రకారం పురంధేశ్వరిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు అన్నారు.. అసలు, చంద్రబాబు.. తెలంగాణ లో ఎందుకు కాంగ్రెస్ కు మద్దతు పలికారో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
చంద్రబాబు ఆరోగ్యం బాలేదు అని చెబుతూ.. ఇలాంటి అసహజ రాజకీయాలు చేయడం మంచిది కాదు అని హితవుపలికారు ఆమంచి.. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ఎప్పుడు కలిసే ఉంటాయన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు మద్దతు ఇస్తే ఓపెన్ గా చెప్పాలన్నారు. ఇక, జనసేనలో 90 శాతం కాపులే ఉన్నారు.. ఏపీ కుల రాజకీయాలకు వేదికగా అభివర్ణించారు. జనసేన – టీడీపీ రెండు భిన్న ధృవాలు.. అయితే, వీరిద్దరూ కలవడం కూడా తప్పు లేదన్నారు. వాళ్లు ఎందుకు కలిసారో జస్టిఫికేషన్ ఉండాలి.. ఇదే విషయాన్ని నేను జనంలోకి తీసుకెళ్తానని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణ మోహన్.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!