Allu Arjun: ఆ లెటర్ పూర్తిగా చదవలేదు.. కానీ ఆశ్చర్యపోయాను: అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun React on Wax Statue at Madame Tussauds: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్’ సినిమాలోని ఐకానిక్ పోజ్ ‘తగ్గేదేలే’తో అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఆవిష్కరించారు. దుబాయ్లోని మేడమ్ టుస్సాడ్స్లో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా అల్లు అర్జున్ స్పందించారు. మేడమ్ టుస్సాడ్స్ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి ముందుగా తాను ఆశ్చర్యపోయానన్నారు.
టుస్సాడ్స్ దుబాయ్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా పోస్ట్ చేసిన వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ… ‘ఓరోజు నేను మా ఆఫీస్కు వెళ్లగానే అక్కడివారు వాళ్లందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. కొంతసమయానికి వారు నాకు ఓ లెటర్ ఇచ్చారు. లెటర్ పూర్తిగా చదవలేదు కానీ.. మేడమ్ టుస్సాడ్స్ అని చూడగానే ఆశ్చర్యానికి గురయ్యా. నా మైనపు విగ్రహం చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హెయిర్ పార్ట్ అద్భుతంగా తీర్చిదిద్దారు. నా మోస్ట్ ఐకానిక్ పోజుల్లో తగ్గేదేలే ఒకటి’ అన్నారు.
Also Read
Also Read: Sunny Leone: ఎంగేజ్మెంట్ అయ్యాక ఇష్టం లేదని చెప్పి.. నా మనసు ముక్కలు చేశాడు: సన్నీ లియోన్
సినిమా, క్రీడలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచుతారు. సింగపూర్, లండన్, దుబాయ్.. పలు వివిధ చోట్ల ఈ మ్యూజియం శాఖలున్నాయి. దుబాయ్లోని మ్యూజియంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్బీర్ కపూర్, షారుక్ ఖాన్.. వంటి సినీ ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.మహేశ్ బాబు, ప్రభాస్, కాజల్ వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ వీరి సరసన చేరారు. పుష్పతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప-ది రూల్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!