ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘AA22’ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోకి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది.. ఈ సినిమాలో రష్మిక నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుందట. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేసిన రష్మిక, తొలిసారి బన్నీని ఢీకొట్టే విలన్గా నటించడం విశేషం. ముందు నుండి కూడా ఈ మూవీలో రష్మిక కూడా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాప్పటికి మూవీ టీం నుండి ఎలాంటి స్పందన రాలేదు.. కానీ ఇప్పడు
ముంబై షెడ్యూల్లో రష్మిక తన సోలో సీన్ల షూటింగ్లో పాల్గొంటోంది. ఇది పూర్తయ్యాక అల్లు అర్జున్, జాన్వీ కపూర్, జిమ్ సర్భ్లతో కలిసి కీలక సన్నివేశాల్లో నటించనుందట. ‘పుష్ప’లో బన్నీకి జోడీగా అలరించిన ఈ జంట, ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎలా తలపడతారనేది ఫ్యాన్స్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో దీపికా పదుకొణె మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై వస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అల్లు అర్జున్ మల్టిపుల్ రోల్స్లో కనిపిస్తారనే వార్తలతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
