Alleti Maheswara Reddy: రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు.. ప్రభుత్వంపై విమర్శలు
- రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు
- ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి విమర్శలు
- మాయల గారడితో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు- ఏలేటి మహేశ్వర రెడ్డి మూడో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా సంబరాలు చేసేందుకు సిగ్గుండాలి?
- రుణమాఫీకి ఇచ్చింది రూ. 6098 కోట్లు మాత్రమే- మహేశ్వర రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాయల గారడితో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఏమీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తున్నారు.. మూడో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా సంబరాలు చేసేందుకు సిగ్గుండాలి? అని దుయ్యబట్టారు. రుణమాఫీకి ఇచ్చింది రూ.6098 కోట్లు మాత్రమే ఇచ్చారు.. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేశారు? అని మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. మీ ఇష్టానుసారంగా తోచింది చేస్తాం అంటే ప్రజాస్వామ్యంలో కుదరదు.. రెండో వంతు మందిని రుణమాఫీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. మీ మేనిఫెస్టో ప్రకారం ప్రతి రైతుకూ రుణమాఫీ ఇవ్వాలని అన్నారు. లేదంటే బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేసి అసెంబ్లీ ముట్టడి చేస్తామని పేర్కొన్నారు.
IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
Also Read
- CM Vijay - Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. 'నీలోఫర్' అసాధారణ ప్రయాణం.!
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
గత కేసీఆర్ హయంలో 37 లక్షల మంది రైతులు ఉంటే ఈరోజు 11 లక్షలకు ఎలా తగ్గారు? అని ఆయన ప్రశ్నించారు. 22 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేయకుండా ఎగగొట్టారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు రుణమాఫీ చేస్తారా? చెయ్యరా అని ప్రశ్నించారు. పాస్ బుక్ ప్రామాణికం అని సీఎం చెప్పారు.. కానీ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ చేయడం దారుణం అని అన్నారు. మరోవైపు.. రైతు భరోసాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. మీరు అసెంబ్లీలో మాట్లాడతాం అంటున్నారు.. అసలు మాట్లాడేది ఏముంది? అని పేర్కొన్నారు. బడ్జెట్ అలొకేషన్ చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ఈ సీజన్ లో రైతు భరోసాను స్కిప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.
CBRE: ఈ ఏడాది దేశంలో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు..హైదరాబాద్ లో ఎన్ని యూనిట్లంటే..?
రుణ మాఫీ వలే రైతు భరోసాలో మోసం చేసే అవకాశం చేస్తున్నారని ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు. రైతుల ఆర్థిక భారం కంటే.. మీ ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ కంపెనీ వలె ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్.. ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక, యువత, నిరుద్యోగ వ్యతిరేక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. దోచుకోవడం కోసమే పాలన సాగిస్తున్నారని అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రతి స్కీమ్ లో స్కాం ఉంటుందని అన్నారు. పీఎం కిసాన్ సమ్మన్ నిధి అనేది తాము ఎన్నికల హామీగా ఇవ్వలేదని.. ఆ రోజు ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మొత్తం రైతుల డేటా ఇవ్వలేదని తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వేస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
-
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
-
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
-
Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!