Alleti Maheswara Reddy: రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు.. ప్రభుత్వంపై విమర్శలు
- రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు
- ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి విమర్శలు
- మాయల గారడితో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు- ఏలేటి మహేశ్వర రెడ్డి మూడో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా సంబరాలు చేసేందుకు సిగ్గుండాలి?
- రుణమాఫీకి ఇచ్చింది రూ. 6098 కోట్లు మాత్రమే- మహేశ్వర రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాయల గారడితో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఏమీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తున్నారు.. మూడో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా సంబరాలు చేసేందుకు సిగ్గుండాలి? అని దుయ్యబట్టారు. రుణమాఫీకి ఇచ్చింది రూ.6098 కోట్లు మాత్రమే ఇచ్చారు.. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేశారు? అని మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. మీ ఇష్టానుసారంగా తోచింది చేస్తాం అంటే ప్రజాస్వామ్యంలో కుదరదు.. రెండో వంతు మందిని రుణమాఫీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. మీ మేనిఫెస్టో ప్రకారం ప్రతి రైతుకూ రుణమాఫీ ఇవ్వాలని అన్నారు. లేదంటే బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేసి అసెంబ్లీ ముట్టడి చేస్తామని పేర్కొన్నారు.
IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
Also Read
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
గత కేసీఆర్ హయంలో 37 లక్షల మంది రైతులు ఉంటే ఈరోజు 11 లక్షలకు ఎలా తగ్గారు? అని ఆయన ప్రశ్నించారు. 22 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేయకుండా ఎగగొట్టారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు రుణమాఫీ చేస్తారా? చెయ్యరా అని ప్రశ్నించారు. పాస్ బుక్ ప్రామాణికం అని సీఎం చెప్పారు.. కానీ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ చేయడం దారుణం అని అన్నారు. మరోవైపు.. రైతు భరోసాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. మీరు అసెంబ్లీలో మాట్లాడతాం అంటున్నారు.. అసలు మాట్లాడేది ఏముంది? అని పేర్కొన్నారు. బడ్జెట్ అలొకేషన్ చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ఈ సీజన్ లో రైతు భరోసాను స్కిప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.
CBRE: ఈ ఏడాది దేశంలో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు..హైదరాబాద్ లో ఎన్ని యూనిట్లంటే..?
రుణ మాఫీ వలే రైతు భరోసాలో మోసం చేసే అవకాశం చేస్తున్నారని ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు. రైతుల ఆర్థిక భారం కంటే.. మీ ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ కంపెనీ వలె ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్.. ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక, యువత, నిరుద్యోగ వ్యతిరేక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. దోచుకోవడం కోసమే పాలన సాగిస్తున్నారని అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రతి స్కీమ్ లో స్కాం ఉంటుందని అన్నారు. పీఎం కిసాన్ సమ్మన్ నిధి అనేది తాము ఎన్నికల హామీగా ఇవ్వలేదని.. ఆ రోజు ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మొత్తం రైతుల డేటా ఇవ్వలేదని తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వేస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!