CBRE: ఈ ఏడాది దేశంలో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు..హైదరాబాద్ లో ఎన్ని యూనిట్లంటే..?
- రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం
- ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలు
- కానీ ధనవంతులపై ఎలాంటి ప్రభావం చూపని ద్రవ్యోల్బణం
- ఈ ఏడాది త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు
- ఆరు నెలల వ్యవధిలో మొత్తం 8500 విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఓ వైపు మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు దేశంలోని ధనవంతులపై ద్రవ్యోల్బణం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ (CBRE) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని ధనవంతులు విలాసవంతమైన ఆస్తులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది త్రైమాసికంలో (జనవరి నుంచి జూన్) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో వార్షిక ప్రాతిపదికన రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్ల విక్రయాలు 27% పెరిగాయి. ఈ నగరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలో మొత్తం 8,500 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడయ్యాయి. అమ్మకాలలో 84% దోహదపడింది.
READ MORE: IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఢిల్లీ-ఎన్సీఆర్లో గరిష్ట విక్రయాలు..
జనవరి-జూన్లో ఢిల్లీ-ఎన్సీఆర్లో గరిష్టంగా 3,300 లగ్జరీ ఇళ్లు విక్రయించబడ్డాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 14 శాతం ఎక్కువ. ముంబైలో విక్రయాలు కూడా 14 శాతం పెరిగి 2,500 యూనిట్లకు చేరుకోగా.. హైదరాబాద్లో విక్రయాలు 44 శాతం పెరిగి 1,300 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నై మరియు కోల్కతాలో వరుసగా 100 మరియు 200 ఇళ్ళు అమ్ముడయ్యాయి. పుణెలో విక్రయాలు 450 శాతం పెరిగి 1,100 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరులో అమ్మకాలు జరగలేదు.
READ MORE:Puja Khedkar: ఒక్క ట్వీట్ తో ఐఏఎస్ పోస్ట్ ఊస్ట్.. ఆ ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరంటే.. ?
నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల..
ఇళ్లకు అధిక డిమాండ్ కారణంగా టాప్ 30 టైర్-2 నగరాల్లో ఇళ్ల ధరలు నాలుగేళ్లలో 94 శాతం పెరిగాయి. డేటా అనలిస్ట్ కంపెనీ ప్రాప్ ఈక్విటీ(PropEquity) ప్రకారం.. 2023-24లో ప్రాజెక్ట్ల సగటు ఆఫర్ ధర 2019-20 రేట్ల కంటే చాలా ఎక్కువ. విలాసవంతమైన ఆస్తుల విక్రయానికి సంబంధించి.. క్రెడాయ్ ఎన్ సీఆర్ (NCR) ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. “విలాసవంతమైన ఆస్తి పట్ల పెరుగుతున్న ఆసక్తి సంపన్నమైన భారత ఆర్థిక వ్యవస్థకు సంకేతం. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ వృద్ధి సానుకూల సంకేతం. ప్రజల వద్ద డబ్బు ఉంది. అందుకే వారు ఇప్పుడు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన జీవితం వైపు పయనిస్తున్నారు. ” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!