CBRE: ఈ ఏడాది దేశంలో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు..హైదరాబాద్ లో ఎన్ని యూనిట్లంటే..?
- రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం
- ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలు
- కానీ ధనవంతులపై ఎలాంటి ప్రభావం చూపని ద్రవ్యోల్బణం
- ఈ ఏడాది త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు
- ఆరు నెలల వ్యవధిలో మొత్తం 8500 విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఓ వైపు మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు దేశంలోని ధనవంతులపై ద్రవ్యోల్బణం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ (CBRE) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని ధనవంతులు విలాసవంతమైన ఆస్తులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది త్రైమాసికంలో (జనవరి నుంచి జూన్) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో వార్షిక ప్రాతిపదికన రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్ల విక్రయాలు 27% పెరిగాయి. ఈ నగరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలో మొత్తం 8,500 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడయ్యాయి. అమ్మకాలలో 84% దోహదపడింది.
READ MORE: IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
Also Read
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
- Smartphone Price Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
- Campa Cola vs Coca-Cola: 'కోలా వార్'లో కొత్త మలుపు.. అంబానీ 'క్యాంపా' దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
ఢిల్లీ-ఎన్సీఆర్లో గరిష్ట విక్రయాలు..
జనవరి-జూన్లో ఢిల్లీ-ఎన్సీఆర్లో గరిష్టంగా 3,300 లగ్జరీ ఇళ్లు విక్రయించబడ్డాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 14 శాతం ఎక్కువ. ముంబైలో విక్రయాలు కూడా 14 శాతం పెరిగి 2,500 యూనిట్లకు చేరుకోగా.. హైదరాబాద్లో విక్రయాలు 44 శాతం పెరిగి 1,300 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నై మరియు కోల్కతాలో వరుసగా 100 మరియు 200 ఇళ్ళు అమ్ముడయ్యాయి. పుణెలో విక్రయాలు 450 శాతం పెరిగి 1,100 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరులో అమ్మకాలు జరగలేదు.
READ MORE:Puja Khedkar: ఒక్క ట్వీట్ తో ఐఏఎస్ పోస్ట్ ఊస్ట్.. ఆ ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరంటే.. ?
నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల..
ఇళ్లకు అధిక డిమాండ్ కారణంగా టాప్ 30 టైర్-2 నగరాల్లో ఇళ్ల ధరలు నాలుగేళ్లలో 94 శాతం పెరిగాయి. డేటా అనలిస్ట్ కంపెనీ ప్రాప్ ఈక్విటీ(PropEquity) ప్రకారం.. 2023-24లో ప్రాజెక్ట్ల సగటు ఆఫర్ ధర 2019-20 రేట్ల కంటే చాలా ఎక్కువ. విలాసవంతమైన ఆస్తుల విక్రయానికి సంబంధించి.. క్రెడాయ్ ఎన్ సీఆర్ (NCR) ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. “విలాసవంతమైన ఆస్తి పట్ల పెరుగుతున్న ఆసక్తి సంపన్నమైన భారత ఆర్థిక వ్యవస్థకు సంకేతం. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ వృద్ధి సానుకూల సంకేతం. ప్రజల వద్ద డబ్బు ఉంది. అందుకే వారు ఇప్పుడు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన జీవితం వైపు పయనిస్తున్నారు. ” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!