Alla RamaKrishna Reddy: సీఎం జగన్ను కలవనున్న వైఎస్ షర్మిల.. ఎమ్మెల్యే ఆర్కే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alla RamaKrishna Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఈ రోజు భేటీ కానున్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో ఆయన్ని కలవనున్నారు సోదరి షర్మిల.. అయితే, చాలా గ్యాప్ తర్వాత అన్నా చెల్లెలు కలవనుండడం.. అది కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేముందు.. ఆయన్ని కలిసి వెళ్తుండడంతో.. ఫ్యామిలీ మీటింగే అయినా.. రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, ఇప్పటికే ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి.. తన ప్రయాణం వైఎస్ షర్మిలతోనే అని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక, వైఎస్ జగన్తో సమావేశంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈరోజు కేవలం వివాహ ఆహ్వానం ఇవ్వడానికి మాత్రమే వైఎస్ షర్మిల.. సీఎం జగన్ దగ్గరకు వస్తున్నారు.. అవసరమైతే షర్మిలతో నేను కూడా సీఎం జగన్ ఇంటికి వెళ్తానన్నారు ఎమ్మెల్యే ఆర్కే.. ఇక, సారవంతమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడం దుర్మార్గం అన్నారు. ఓటుకు నోటు కేసులో కాంప్రమైజ్ అయ్యేది లేదు.. సుప్రీంకోర్టులో ఈ కేసుపై పోరాడుతానని ప్రకటించారు.. ఓటుకు నోటు కేసు సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు.. మరోవైపు.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడంలో వైసీపీ లోపాలను ఎండగడతాం అన్నారు ఆర్కే.. ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో మాకు తెలుసన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక మంది పనిచేస్తూనే ఉన్నారు.. నేను పార్టీలో కొత్తగా చేరుతున్నా.. సీనియర్లు నా ముందు వరుసలో ఉండాలని నేను కోరుకుంటాను అన్నారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ఇక, రాజకీయం వేరు కుటుంబ బంధాలు వేరు.. రాజకీయంలో నా వ్యక్తిగత నిర్ణయం నాది, అలాగని కుటుంబ బంధాన్ని పోగొట్టు కోను అన్నారు ఆర్కే.. రేపు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని స్పష్టం చేశారు. స్వతంత్ర ఉద్యమానికి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది.. సంస్థాగతంగా బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది.. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!